సోనియా రాజీనామా.. ఖండించిన కాంగ్రెస్!
పార్టీలో సమర్థవంతమైన నాయకత్వ అవసరం, మార్పులు సూచిస్తూ 23 మంది కాంగ్రెస్ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి ఆదివారం లేఖ రాశారు. తాజాగా దీనిపై సోనియా గాంధీ స్పందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.....
దిల్లీ: పార్టీలో సమర్థ శాశ్వత నాయకత్వ అవసరం, పార్టీలో కొన్ని మార్పులు సూచిస్తూ 23 మంది కాంగ్రెస్ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి ఇటీవల లేఖ రాశారు. దీనిపై సోనియా గాంధీ తన స్పందనగా.. అందరం కలిసి ఉమ్మడిగా కొత్త అధ్యక్షుడిని వెతుకుదామని, పార్టీ సారథ్య బాధ్యతలను మోయలేనని వారికి బదులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు సోమవారం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఆ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా ఓ ప్రకటనలో ఖండించారు.
మరోవైపు సోమవారం జరగనున్న సీడబ్ల్యూసీ భేటీలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక, పార్టీ కార్యాలయ మార్పు వంటి విషయాలపై కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం. ఒక వేళ రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు విముఖంగా ఉంటే, గట్టి నిర్ణయాలు తీసుకునే నాయకుడిని అధ్యక్షుడిగా నియమించాలని లేదా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని నేతలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపటి సీడబ్ల్యూసీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, గాంధీ కుటుంబ నాయకత్వానికే పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.