Pattabhi Ram: అవినాష్‌రెడ్డి అరెస్టుకు సుప్రీంలో లైన్‌ క్లియర్‌: పట్టాభి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సుప్రీంకోర్టులో లైన్ క్లియర్ అయిందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు.

Published : 23 May 2023 15:12 IST

రాజమహేంద్రవరం: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సుప్రీంకోర్టులో లైన్ క్లియర్ అయిందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. రాజమహేంద్రవరంలో పట్టాభి మీడియాతో మాట్లాడారు. కర్నూలులో ఉన్న అవినాష్‌ రెడ్డి.. తనను అరెస్టు చేయనీకుండా ప్రైవేటు సైన్యాన్ని మోహరించి సీబీఐని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ స్పందించి.. వెంటనే కర్నూలుకు బలగాలను పంపించాలని కోరారు. అవినాష్ రెడ్డి తల్లి ప్రాణాలకూ ముప్పు పొంచి ఉందని.. ఆమెను ఎందుకని హైదరాబాద్ లేదా బెంగళూరుకు తరలించడం లేదని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌ డైరెక్షన్‌లోనే అవినాష్‌ను అరెస్టు చేయనీకుండా ప్రైవేటు సైన్యం అడ్డుకుంటోందని పట్టాభి విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని