Andhra News: జగన్‌ వ్యాఖ్యలు వారిని ఉద్దేశించినవే.. : జేసీ ప్రభాకర్‌రెడ్డి

వెంట్రుక కూడా పీకలేరన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలు వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించే చేశారని తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

Updated : 13 Apr 2022 16:49 IST

అనంతపురం: వెంట్రుక కూడా పీకలేరన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలు వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించే చేశారని తెదేపా సీనియర్‌ నేత, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ వ్యాఖ్యలను అందరూ ప్రజలనో, మరొకరినో అన్నారని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. నచ్చిన వారికి కేబినెట్‌లో అవకాశం ఇస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారని తెలిపారు. తాను చెప్పిందే వేద వాక్కు అని వారికి చెప్పకనే చెప్పారని ప్రభాకర్‌రెడ్డి వివరించారు.

ఇష్టం వచ్చినట్లు మంత్రివర్గ కూర్పు చేసినా ఎవరూ ఏమీ చేయలేరన్నదే జగన్‌ ఉద్దేశం కావొచ్చన్నారు. అయితే విద్యాదీవెన పేరిట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సభలో జగన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదని జేసీ ప్రభాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని