AP News: పరిషత్‌ ఓట్ల లెక్కింపుపై గుంటూరులో ఎస్‌ఈసీ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌ ఆదివారం పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం

Updated : 18 Sep 2021 11:46 IST

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నీ సమీక్ష నిర్వహించారు. గుంటూరులోని కలెక్టరేట్‌లో ఆమె అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై చర్చించారు. సమీక్ష అనంతరం ఆమె కౌంటింగ్‌ కేంద్రాలను సందర్శించనున్నారు. సమావేశంలో కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌, డీఐజీ త్రివిక్రమ వర్మ, ఎస్పీ ఆరీఫ్‌ హాఫిజ్‌, రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని