AP News: అంబులెన్స్ను అడ్డుకున్న పోలీసులు... లోకేశ్, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం
తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది
అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గాయపడిన కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి అంబులెన్స్లో వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. గాయాలు చూపించేందుకు పార్టీ కార్యాలయానికి వస్తున్న వీరి వాహనాన్ని పోలీసులు రోడ్డుపైనే చాలాసేపు నిలిపివేశారు. పార్టీ నేతలు ఎన్ని సార్లు కోరినా పోలీసులు అంబులెన్స్ను వదలకపోవడంతో పార్టీ కార్యాలయంలో ఉన్న జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఒక్కసారిగా రోడ్డెక్కడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల తీరుకు నిరసనగా లోకేశ్, తెదేపా నేతలు రోడ్డుపైకి ర్యాలీగా వెళ్లారు. ఈక్రమంలో తెదేపా నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యాలయం వద్ద రోడ్డుపై తెదేపా నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తెదేపా నేతలు అంబులెన్స్ను పోలీసుల దిగ్బంధం నుంచి విడిపించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన క్షతగాత్రులను పరామర్శించిన లోకేశ్ అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
గంజి చిరంజీవిపై కేసు నమోదు
తెదేపా అధికార ప్రతినిధి గంజి చిరంజీవిపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. తెదేపా కార్యాలయంపై దాడికి నిరసనగా రాస్తారోకో చేశారని పేర్కొంటూ ఆయనతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. ఆత్మకూరు వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.