Winter session: కాంగ్రెస్కు ఝలక్.. విపక్షాల భేటీకి టీఎంసీ దూరం
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్కు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఝలక్ ఇచ్చింది.....
దిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్కు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఝలక్ ఇచ్చింది. ఈ సమావేశాల్లో కాంగ్రెస్తో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా లేమని ప్రకటించింది. అయితే, వివిధ అంశాలపై ఇతర విపక్షాలకు సహకరిస్తామని టీఎంసీ సీనియర్ నేత ఒకరు స్పష్టం చేశారు. నవంబర్ 29న కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చిన విపక్షాల సమావేశానికి తమ పార్టీ హాజరవటం లేదని తెలిపారు. కాంగ్రెస్, టీఎంసీల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, ఈ క్రమంలో అంతర్గతంగా నేతల మధ్య సమన్వయం చేస్తూ ముందు సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు.
‘శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచే ఆలోచన లేదు. కాంగ్రెస్ నేతలు ముందు వారి మధ్య సమన్వయాన్ని పెంచుకోవాలి. సొంత ఇంటిని ముందు చక్కదిద్దుకోవాలి. ఆ తర్వాత ఇతర పార్టీలతో దోస్తీ కోసం ప్రయత్నించాలి. ప్రజాప్రయోజనాల కోసం వివిధ అంశాలను లేవనెత్తుతూ.. ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగుతాం’ అని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత పేర్కొన్నారు. భాజపాపై పోరాటానికి కాంగ్రెస్తో కలిసేందుకు ఇష్టపడకపోవటంపై ప్రశ్నించగా.. ఆ పార్టీ నేతల్లోనే సరైన అవగాహన, లక్ష్యం లేదని పేర్కొన్నారు. నవంబర్ 29న బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇంట్లో జాతీయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ భేటీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం సహా ఇతర కీలక అంశాలపై చర్చించనున్నామని అన్నారు.
► Read latest Political News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.