Talasani: తెరాస తిరుగులేని శక్తిగా మారింది: తలసాని

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తెరాస జెండా రెపరెపలాడుతోంది. జెండా పండుగలో భాగంగా తెరాస మంత్రులు,

Updated : 30 Sep 2022 14:49 IST

వాడవాడలా రెపరెపలాడిన గులాబీ జెండా 

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తెరాస జెండా రెపరెపలాడుతోంది. జెండా పండుగలో భాగంగా తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర నేతలు పార్టీ కార్యాలయాల వద్ద గులాబీ జెండాలు ఎగురవేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆదేశాల మేరకు తెరాస జెండా పండుగ నిర్వహిస్తోంది. తెలంగాణ భవన్‌లో వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ మహమద్‌ సలీం గులాబీ జెండాను ఎగురవేశారు.

సికింద్రాబాద్‌ బంసిలాల్ పేట్ డివిజన్ పరిధిలోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెరాస జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ తిరుగులేని శక్తిగా మారిందన్నారు. ఖైరతాబాద్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ గులాబీ జెండా ఎగురవేశారు. ఈ జెండా పండగ పూర్తి కాగానే.. గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం మొదలు కానుంది. ఈ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 51శాతం ఉండాలని సీఎం దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇవాళ దేశ రాజధాని దిల్లీలో తెరాస భవనానికి కేసీఆర్‌ భూమిపూజ చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని