Akhilesh Yadav: యోగికి తెలుసు..అందుకే గంగానదిలో స్నానమాచరించలేదు
ప్రధాని మోదీ వారణాసి పర్యటన నేపథ్యంలో విపక్షాలు కేంద్రం, యూపీలోని భాజపా ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నాయి. కోట్లు ఖర్చుపెడుతున్నా..విషతుల్యంగా మారిన గంగానది ఎప్పటికి శుభ్రమవుతుందోనని మండిపడున్నాయి. ఇదే విషయమై సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడారు.
భాజపాపై అఖిలేశ్ విమర్శలు
లఖ్నవూ: ప్రధాని మోదీ వారణాసి పర్యటన నేపథ్యంలో విపక్షాలు కేంద్రం, యూపీలోని భాజపా ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నాయి. కోట్లు ఖర్చుపెడుతున్నా..విషతుల్యంగా మారిన గంగానది ఎప్పటికి శుభ్రమవుతుందోనని మండిపడున్నాయి. ఇదే విషయమై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడారు.
‘గంగానదిని స్వచ్ఛంగా మార్చేందుకు భాజపా కోట్లు ఖర్చుపెడుతోంది. గంగానది కాలుష్య కాసారంలా ఉందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు తెలుసు. అందుకే ఆయన నదిలో స్నానమాచరించలేదు. అసలు నా ప్రశ్న ఏంటంటే.. గంగమ్మ తల్లి ఎప్పటికైనా శుభ్రమవుతుందా..? నిధులు ప్రవహిస్తున్నాయి కానీ, గంగా నది మాత్రం శుభ్రం కాలేదు’ అని అఖిలేశ్ విమర్శించారు.
సోమవారం వారణాసిలో కాశీ విశ్వనాథుడి ఆలయ నడవాను ప్రారంభించిన మోదీ.. ఈ రోజు కూడా అక్కడే పర్యటిస్తున్నారు. నిన్న విశ్వనాథుడిని దర్శించుకోవడానికి ముందు ప్రధాని కాషాయ వస్త్రాల్లో గంగా నది స్నానమాచరించారు. అక్కడ యోగి కనిపించలేదు. దానిని ఉద్దేశించి అఖిలేశ్ విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. కొద్ది నెలల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి గద్దెనెక్కాలని భాజపా ప్రయత్నిస్తుండగా.. సమాజ్వాదీ పార్టీ కూడా అధికారం హస్తగతం చేసుకునేలా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.