Telangana News: రేవంత్‌రెడ్డికి తప్ప రైతులెవరికీ ఇబ్బందులు లేవు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ధాన్యం సేకరణపై కాంగ్రెస్‌, భాజపా నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని  రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.

Published : 25 Apr 2022 02:10 IST

హైదరాబాద్‌: ధాన్యం సేకరణపై కాంగ్రెస్‌, భాజపా నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని  రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణలోని ధాన్యం సేకరించకుండా భాజపా నేతలు అడ్డుకున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

2014నుంచి ధాన్యం ఎలా సేకరించామో విపక్షాలకు తెలియదన్న ఆయన ఇప్పటికే అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. ధాన్యం సేకరణ సక్రమంగా సాగుతోందన్న పల్లా.. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి తప్ప రైతులెవరికీ ఇబ్బందులు లేవన్నారు. రేవంత్‌రెడ్డి ఇలాగే వ్యవహరిస్తే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని పల్లా హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని