Telangana News: రేవంత్రెడ్డికి తప్ప రైతులెవరికీ ఇబ్బందులు లేవు: పల్లా రాజేశ్వర్రెడ్డి
ధాన్యం సేకరణపై కాంగ్రెస్, భాజపా నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: ధాన్యం సేకరణపై కాంగ్రెస్, భాజపా నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే రేవంత్రెడ్డి, బండి సంజయ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణలోని ధాన్యం సేకరించకుండా భాజపా నేతలు అడ్డుకున్నారని పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు.
2014నుంచి ధాన్యం ఎలా సేకరించామో విపక్షాలకు తెలియదన్న ఆయన ఇప్పటికే అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. ధాన్యం సేకరణ సక్రమంగా సాగుతోందన్న పల్లా.. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి తప్ప రైతులెవరికీ ఇబ్బందులు లేవన్నారు. రేవంత్రెడ్డి ఇలాగే వ్యవహరిస్తే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని పల్లా హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.