KCR: కేసీఆర్‌ ఎత్తుగడలకు ప్రజామోదం లభిస్తుంది: పంచాంగకర్త

 క్రోధి నామ సంవత్సరం ఉగాది వేడుకలను తెలంగాణ భవన్‌లో నిర్వహించారు.

Published : 09 Apr 2024 15:22 IST

హైదరాబాద్‌: కొత్త ఏడాదిలో అందరికీ మంచి జరగాలని.. శాంతి, సౌభాగ్యం, మత సామరస్యంతో ఉండాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆకాంక్షించారు. క్రోధి నామ సంవత్సరం ఉగాది వేడుకలను తెలంగాణ భవన్‌లో నిర్వహించారు.  ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు.. పంచాంగ పఠనం చేశారు. 

క్రోధి సంవత్సరంలో మంచి, చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయని.. వర్షాలు సమృద్ధిగా పడి పాడిపంటలు చక్కడా పండుతాయని తెలిపారు. పాలక పక్షానికి కొంత కష్టసాధ్యంగా కనిపిస్తోందని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ‘‘భారాస అధినేత కేసీఆర్‌ది కర్కాటక రాశి. ఆదాయ వ్యయాలు సంతోషకరంగా ఉన్నాయి. కేసీఆర్‌ ఎత్తుగడలకు ప్రజామోదం లభిస్తుంది. చేపట్టే వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశముంది. మకర రాశికి చెందిన కేటీఆర్‌ ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఈ ఏడాది మంచి ప్రభావం కనిపిస్తోంది’’ అని పంచాంగకర్త తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న కేటీఆర్... వర్షాలు బాగా పడి, పంటలు బాగా పండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని