UP Polls: యూపీలో ఆరోవిడత ఎన్నికలు.. మధ్యాహ్నానికి 36శాతం పోలింగ్!
ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 36.33శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. 10 జిల్లాల పరిధిలో 57 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 36.33శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. గోరఖ్పుర్ స్థానం నుంచి బరిలో ఉన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తోపాటు పలువురు ప్రముఖులు ఈ విడత ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ దశ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (గోరఖ్పుర్ అర్బన్), రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్కుమార్ లల్లూ (తమ్కుహీ రాజ్), ఇటీవలే భాజపా నుంచి సమాజ్వాదీ పార్టీలోకి మారిన స్వామిప్రసాద్ మౌర్య (ఫాజిల్నగర్) సహా మొత్తం 676 మంది అభ్యర్థులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పూర్వాంచల్లోని అంబేడ్కర్నగర్, బలరాంపుర్, సిద్ధార్థ్నగర్, బస్తీ, సంత్ కబీర్నగర్, మహారాజ్గంజ్, గోరఖ్పుర్, కుశీనగర్, దేవరియా, బలియా జిల్లాల పరిధిలో మొత్తం 57 అసెంబ్లీ స్థానాల్లో ఆరోవిడత పోలింగ్ జరుగుతోంది. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో వీటిలో 46 సీట్లు భాజపా ఖాతాలోకి వెళ్లాయి.
గోరఖ్పుర్ అర్బన్ స్థానం నుంచి పోటీ చేస్తోన్న సీఎం యోగిపై.. భాజపా దివంగత నేత ఉపేంద్ర శుక్లా సతీమణి శుభావతి శుక్లాను సమాజ్వాదీ పార్టీ బరిలో దించింది. భీమ్ఆర్మీ వ్యవస్థాపకుల్లో ఒకరైన చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక నేడు జరుగుతోన్న ఆరో దశ పోలింగ్తో యూపీలో 349 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తవుతుంది. మిగతా 54 సీట్లకు ఈ నెల 7న చివరి విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.