పల్లె పోరులో యువ తారలు
పంచాయతీల్లో ఎన్నికల్లో పోటీకి యువతరం ముందుకొస్తోంది. ఇంజినీరింగ్ వంటి సాంకేతిక విద్యతోపాటు సీఏ వంటి వృత్తిపరమైన కోర్సులు చదువుతున్నవారు సైతం ఈ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నారు....
అభివృద్ధే ధ్యేయమంటున్న యువతరం
ఇంటర్నెట్ డెస్క్: పంచాయతీల్లో ఎన్నికల్లో పోటీకి యువతరం ముందుకొస్తోంది. ఇంజినీరింగ్ వంటి సాంకేతిక విద్యతోపాటు సీఏ వంటి వృత్తిపరమైన కోర్సులు చదువుతున్నవారు సైతం ఈ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. సరికొత్త ఆలోచనలతో ఉత్తమ పరిపాలనే ధ్యేయంగా పల్లెపోరులో యువతరం పోటీ పడుతోంది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు సర్పంచిగా గిరిజ పోటీ చేస్తున్నారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన గిరిజ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు నెల రోజుల క్రితమే బాపట్లకు చెందిన యువకుడితో వివాహం జరిగింది. గిరిజ స్వగ్రామమైన అందుకూరులో సర్పంచి స్థానం మహిళకు రిజర్వు కావడంతో గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగారు. భర్తతోపాటు అత్తింటివారు కూడా ఆమెను పోటీ చేయించేందుకు అంగీకరించారు. గిరిజ పోటీపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఉన్నత విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.
పెదకూరపాడులో సీఏ విద్యార్థిని సాజీదా వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి పోటీకి దిగారు. ప్రజా జీవితంతోకి రావాలనుకునేవారికి పంచాయతీ ఎన్నికలే తొలి మెట్టు అని సాజీదా అంటున్నారు. రోజూ కొంత సమయం ఆన్లైన్లో సీఏ పాఠాలు వింటూ మిగతా సమయంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని సాజీదా అశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!