పాక్‌ యువకుడి ప్రేమలో మధ్యప్రదేశ్‌ యువతి?

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతి పాకిస్థాన్‌ యువకుడితో ప్రేమలో పడి.. అట్టారీ వాఘా సరిహద్దు ద్వారా దేశం దాటేందుకు ప్రయత్నించింది. పాస్‌పోర్ట్‌, ధ్రువపత్రాలన్నింటినీ వెంటబెట్టుకొని సరిహద్దుకు వెళ్లిన ఆమెను కస్టమ్స్‌ అధికారులు గుర్తించి అడ్డుకున్నారు.

Published : 26 Jun 2022 05:39 IST

సరిహద్దు వద్ద అడ్డుకున్న సిబ్బంది

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతి పాకిస్థాన్‌ యువకుడితో ప్రేమలో పడి.. అట్టారీ వాఘా సరిహద్దు ద్వారా దేశం దాటేందుకు ప్రయత్నించింది. పాస్‌పోర్ట్‌, ధ్రువపత్రాలన్నింటినీ వెంటబెట్టుకొని సరిహద్దుకు వెళ్లిన ఆమెను కస్టమ్స్‌ అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. అనంతరం పంజాబ్‌ అమృత్‌సర్‌లోని ఘరిండా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దేశం దాటేందుకు యత్నించిన యువతిని ఫిఝా ఖాన్‌గా గుర్తించారు. ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోగానే.. మధ్యప్రదేశ్‌లోని రేవా పట్టణంలో ఉండే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని ధ్రువపత్రాలు తీసుకొని వెళ్లిపోయిందని పోలీసులకు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు జరపగా యువతి పాకిస్థాన్‌కు వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు అధికారులతో సమాచారం పంచుకున్నారు. పంజాబ్‌ పోలీసులు ఆమెను.. జిల్లా సబ్‌డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి.. కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చర్యలు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని