8వ అంతస్తు నుంచి కింద పడ్డ రోగి
పశ్చిమబెంగాల్లోని కోల్కతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ ఆసుపత్రిలో ఓ రోగి హల్చల్ చేశాడు. ఎనిమిదో అంతస్తు పిట్టగోడ అంచున కూర్చొని రెండు గంటలకుపైగా హడావుడి చేశాడు. శనివారం ఉదయం 11 గంటల
పశ్చిమబెంగాల్లోని కోల్కతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ ఆసుపత్రిలో ఓ రోగి హల్చల్ చేశాడు. ఎనిమిదో అంతస్తు పిట్టగోడ అంచున కూర్చొని రెండు గంటలకుపైగా హడావుడి చేశాడు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అతడు కింద పడి మరణించాడు. అయితే అతడు కింద పడతాడని ముందే ఊహించిన అధికారులు, ఆసుపత్రి సిబ్బంది.. భవనం బయట వల అమర్చారు. కానీ అతడు మాత్రం నేలపై పడి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అంతకుముందు.. విచిత్రంగా ప్రవర్తిస్తున్న ఈ రోగిని గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనతో అతడిని చేరుకోవడానికి ప్రయత్నించారు. అయినా అతడు కిందకు దిగడానికి నిరాకరించాడు. అక్కడే ఉంటానని చెప్పాడు. దగ్గరికు వస్తే దూకేస్తానంటూ వీరంగం సృష్టించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం