మద్యం మత్తులో యువతుల రచ్చ.. రేంజ్‌ రోవర్‌ కారును అతివేగంతో నడిపి..

హరియాణాలోని అంబాలాలో ఇద్దరు యువతులు మద్యం మత్తులో రచ్చ చేశారు. రేంజ్‌ రోవర్‌ కారును మితిమీరిన వేగంతో నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారు. అంబాలాలోని దిల్లీ-అమృత్‌సర్‌

Updated : 23 May 2022 11:32 IST

రేంజ్‌రోవర్‌తో మరో కారును ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

చండీగఢ్‌: హరియాణాలోని అంబాలాలో ఇద్దరు యువతులు మద్యం మత్తులో రచ్చ చేశారు. రేంజ్‌ రోవర్‌ కారును మితిమీరిన వేగంతో నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారు. అంబాలాలోని దిల్లీ-అమృత్‌సర్‌ జాతీయ రహదారిపై మోహ్డా ధాన్యం మార్కెట్‌ వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఆగి ఉన్న కారును యువతులు ఢీకొట్టడంతో.. అందులో ఉన్న మోహిత్‌ శర్మ (39) అనే వ్యక్తి మరణించారని, ఆయన భార్య దీప్తి, ఇద్దరు కుమార్తెలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఓ ఎస్సై పైనా యువతులు చేయిచేసుకున్నారని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని