Child Marriages: వచ్చే పదేళ్లలో కోటి మందికి బాల్యవివాహాలు
రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి బాల్య వివాహాలు జరగనున్నట్లు ‘ది లాన్సెట్’ జర్నల్ అంచనా వేసింది. కొవిడ్ కారణంగా విద్యావ్యవస్థలో వచ్చిన అలజడి, పెరిగిపోతున్న
‘ది లాన్సెట్’ జర్నల్ అంచనా
ఈనాడు, దిల్లీ: రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి బాల్య వివాహాలు జరగనున్నట్లు ‘ది లాన్సెట్’ జర్నల్ అంచనా వేసింది. కొవిడ్ కారణంగా విద్యావ్యవస్థలో వచ్చిన అలజడి, పెరిగిపోతున్న పేదరికమే అందుకు ప్రధాన కారణాలని తన తాజా సంపాదకీయంలో పేర్కొంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రతి అయిదుగురు మహిళల్లో ఒకరికి 18 ఏళ్లలోపే వివాహం జరుగుతోంది. ఇది వారి ఆరోగ్యం, బాగోగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బాల్య వివాహాల వల్ల- యుక్తవయస్సులో గర్భధారణ, హెచ్ఐవీ బారినపడటం, భాగస్వామి చేతిలో హింసకు గురవడం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. కొవిడ్ మహమ్మారి రాకతో ప్రపంచవ్యాప్తంగా చదువులు చతికిలపడ్డాయి. పేదరికం పెరిగిపోయింది. ఫలితంగా వచ్చే దశాబ్ద కాలంలో కోటి మంది బాలికలు.. బాల్యంలోనే వివాహ ఛట్రంలో ఇరుక్కుపోయే ముప్పుంది. ఏటా 1.2 కోట్ల మంది బాల్యంలోనే వివాహ వ్యవస్థలోకి అడుగుపెడుతున్నారు. నార్త్వెస్ట్ సెంట్రల్ ఆఫ్రికా, దక్షిణాసియా, దక్షిణ అమెరికాల్లో ఈ తరహా పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి. నైగర్లో 76% మంది, బంగ్లాదేశ్లో 59% మంది, బ్రెజిల్లో 36% మంది బాలికలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరుగుతున్నాయి. 2000-18 మధ్య కాలంలో అమెరికాలో దాదాపు 3 లక్షల బాల్య వివాహాలు జరిగాయి. ఇలాంటి పెళ్లిళ్లను అరికట్టాలంటే.. వివాహ వయసును పెంచితే సరిపోదు. ఆడపిల్లలకు నగదో, ఇంకేదైనా ప్రోత్సాహకమో అందిస్తూ బడులకు ఆకర్షించాలి. వారికి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేలా కార్మిక విపణిని విస్తరించాలి. జీవనోపాధి పొందే నైపుణ్యాలు నేర్పాలి. చదువు, ఆర్థిక సాధికారత, నచ్చిన వ్యక్తిని ఎంచుకొనే స్వేచ్ఛ, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ వారికి ఇవ్వాలి’’ అని సంపాదకీయంలో ‘ది లాన్సెట్’ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్