పృథ్వీ షా వద్దు..రాహుల్ రావాల్సిందే
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత క్రికెట్ టెస్టు చరిత్రలోనే అత్యల్ప స్కోరు (36) నమోదుచేసింది. అయితే ఈ ఘోరఓటమి ఆలోచనల నుంచి టీమిండియా తొందరగా..
మరికొన్ని మార్పులు అవసరం: గావస్కర్
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత క్రికెట్ టెస్టు చరిత్రలోనే అత్యల్ప స్కోరు (36) నమోదు చేసింది. అయితే ఈ ఘోర ఓటమి ఆలోచనల నుంచి టీమిండియా తొందరగా బయటపడాలని, రెండో టెస్టులో గొప్పగా పుంజుకోవాలని దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ అన్నాడు. పొరపాట్లను సరిదిద్దుకోకపోతే కంగారూల గడ్డపై టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్కు గురికావాల్సిన పరిస్థితి తలెత్తుతుందని సూచించాడు.
‘‘మెల్బోర్న్ టెస్టును భారత్ గొప్పగా ఆరంభించాలి. సానుకూల ఆలోచన ధోరణితో మైదానంలో అడుగుపెట్టాలి. అలా చేయకపోతే టెస్టు సిరీస్ను 0-4తో కోల్పోయే ప్రమాదం ఉంది. సానుకూల మనస్తత్వంతో బరిలోకి దిగితే టీమిండియా ఎందుకు సత్తాచాటదు? తప్పక రాణిస్తుంది. తొలి టెస్టు ప్రదర్శన తర్వాత కోపం రావొచ్చు. అయితే క్రికెట్లో ఏమైనా జరగవచ్చు. శుక్రవారం, శనివారం రోజు జరిగిన ఆటను గమనించండి. పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి’’ అని గావస్కర్ తెలిపాడు.
‘‘ఆస్ట్రేలియా బలహీనత వాళ్ల బ్యాటింగ్. దానిపై దృష్టిసారించాలి. ఫీల్డింగ్లో చురుకుగా ఉండి, క్యాచ్లను అందుకోవాలి. తొలి టెస్టులో లబుషేన్, టిమ్ పైన్ ఆదిలోనే వెనుదిరిగేవారు. మొదటి ఇన్నింగ్స్లో భారత్కు దాదాపు 120 పరుగుల ఆధిక్యం లభించేది. కానీ క్యాచ్లను జారవిడవడంతో ఆధిక్యం 50 పరుగులకే పరిమితమైంది. అయితే భారత తుదిజట్టులో రెండు మార్పులు అవసరం. పృథ్వీ షా స్థానంలో కేఎల్ రాహుల్ రావాలి. అలాగే శుభ్మన్ గిల్కు కూడా చోటు దక్కాలి. అతడు అయిదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగాలి. గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఆరంభం గొప్పగా ఉంటే పైచేయి సాధించగలం’’ అని పేర్కొన్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లోనూ షా (0,4) విఫలమైన సంగతి తెలిసిందే.
తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన షమి గురించి గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘షమి గాయం భారత్కు ప్రధాన సమస్య. అతడు బౌన్సర్లు, యార్కర్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తించగలడు. అతడు లేకపోవడం టీమిండియాకు సమస్యే. అయితే ఇషాంత్ శర్మ ఫిట్గా ఉంటే వెంటనే అతడిని ఆస్ట్రేలియాకు పంపించాలి. రోజుకు 20 ఓవర్లు బౌలింగ్ చేసే ఫిట్నెస్తో ఉంటే అతడిని తొందరగా టీమిండియాతో కలిసేలా ప్రయత్నించాలి. కాగా, టీమిండియా బ్యాకప్ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాలి. నవదీప్ సైని మంచి బౌలరే. కానీ వార్మప్ మ్యాచ్లో అతడు బౌలింగ్ తీరుని చూస్తే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టలేడనిపిస్తోంది’’ అని అన్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26న భారత్ రెండో టెస్టు ఆడనుంది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అత్యుత్తమ వార్షిక జట్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. భారత్ ఎప్పటిలానే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
ముంబయితో మ్యాచ్కు ముందు ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అందరికంటే ఓ బ్యాటర్కు చాలా భయపడేవాడినని పేర్కొన్నాడు. -
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
వరల్డ్ కప్ కోసం స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడికే వైస్ కెప్టెన్సీని అప్పగించింది. -
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?