పాక్‌ జట్టులో రవూఫ్‌

ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌లతో టీ20 సిరీస్‌లలో తలపడే పాకిస్థాన్‌ జట్టులో పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆరంభ మ్యాచ్‌ల్లో ఆడిన రవూఫ్‌ ఆ తర్వాత గాయంతో క్రికెట్‌కు దూరమయ్యాడు.

Published : 03 May 2024 01:57 IST

లాహోర్‌: ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌లతో టీ20 సిరీస్‌లలో తలపడే పాకిస్థాన్‌ జట్టులో పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆరంభ మ్యాచ్‌ల్లో ఆడిన రవూఫ్‌ ఆ తర్వాత గాయంతో క్రికెట్‌కు దూరమయ్యాడు. ఫిబ్రవరి నుంచి మళ్లీ బరిలో దిగలేదు. ఈ నేపథ్యంలో అతడు ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌లపై ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. బాబర్‌ అజామ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌లో ప్రదర్శన ఆధారంగా టీ20 ప్రపంచకప్‌ తుది జట్టును ఎంపిక చేస్తామని పీసీబీ సెలక్టర్లు తెలిపారు.  మొదట ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ (మే 10న ఆరంభం) ఆడనున్న పాక్‌.. మే 22న ఇంగ్లాండ్‌తో మొదలయ్యే నాలుగు టీ20ల సిరీస్‌లోనూ తలపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని