సెమీస్‌లో నలుగురు భారత బాక్సర్లు

ఆసియా అండర్‌-22, యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. గురువారం అండర్‌-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్‌ (57 కేజీలు),

Published : 03 May 2024 02:04 IST

అస్తానా (కజకిస్థాన్‌): ఆసియా అండర్‌-22, యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. గురువారం అండర్‌-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్‌ (57 కేజీలు), అజయ్‌  (63.5 కేజీలు), అంకుశ్‌ (71 కేజీలు) తుది నాలుగులో చోటు దక్కించుకుని పతకం ఖాయం చేశారు. క్వార్టర్స్‌లో జాదుమణి 5-0తో కిన్లే (భూటాన్‌)ను చిత్తు చేయగా... నిఖిల్‌ 4-0తో అయుబకోన్‌ (ఉజ్బెకిస్థాన్‌)ను ఓడించాడు. డామ్‌దిన్‌దోర్‌ (మంగోలియా)పై అజయ్‌.. లీ సాంగ్‌ (కొరియా)పై అంకుశ్‌ నెగ్గారు. ఈ రెండు బౌట్లలో రిఫరీ బౌట్‌ను ఆపేసి భారత బాక్సర్లను విజేతగా ప్రకటించాడు. 54 కేజీల విభాగంలో ఆశిష్‌ 2-3తో ఒయున్‌ (మంగోలియా) చేతిలో ఓడిపోయాడు. బుధవారం రాత్రి జరిగిన యూత్‌ విభాగం క్వార్టర్స్‌లో ఆర్యన్‌ (92 కేజీ), నిషా (52 కేజీ), ఆకాంశ (70 కేజీ), రుద్రిక (70 కేజీ) గెలిచి పతకాలు ఖరారు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని