Ashwin: భారత విజయాలపై మైకెల్‌ వాన్‌ వ్యాఖ్యలు.. అశ్విన్‌ కౌంటర్

టీమ్‌ఇండియా ప్రదర్శనను తక్కువగా అంచనా వేసిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్‌ వాన్‌కు అశ్విన్‌ సరైన సమాధానం ఇచ్చాడు.

Published : 07 Jan 2024 10:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికా పర్యటనలో (SA vs IND) భారత్‌ ఒక్క సిరీస్‌నూ కోల్పోకుండా స్వదేశానికి చేరింది. తొలి టెస్టులో ఘోర ఓటమి తర్వాత ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్‌ వాన్ టీమ్‌ఇండియాను ఉద్దేశించి తక్కువ స్థాయి జట్టు అంటూ చేసిన వ్యాఖ్యలకు.. స్టార్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగా స్పందించాడు.

‘‘మైకెల్‌ వాన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు నాకు నవ్వొచ్చింది. అవును, మేం గత కొన్నేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయాం. మాది క్రికెట్‌లో అత్యంత బలమైన జట్టు. ఇటీవల టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టీమ్‌ మాదే. దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో టాస్‌ గెలిచి తొలుత ఆ జట్టు బ్యాటింగ్‌ చేసి ఉంటే.. 65 పరుగులకే ఆలౌటయ్యేదేమో? మేం కూడా 24/3 స్కోరుతో ఇబ్బంది పడినప్పుడు విరాట్ - శ్రేయస్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కీలక శతకంతో రాణించాడు. చివరికి మేం 245 పరుగులు చేశాం. 

టెస్టు క్రికెట్‌కు, ఇతర ఫార్మాట్లకు స్పష్టమైన విభజన ఉంది. భారత్‌లో క్రికెట్‌ గురించి అందరూ మాట్లాడుకుంటారు. దీనిని ఓ మతంగా భావిస్తారు. అందుకేనేమో మేం ఎక్కువగా విమర్శలకు గురవుతుంటాం. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్రికెట్‌ను ఓ ఆటగా చూడాలి. నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించడం చాలా ముఖ్యం. మానసిక దృఢత్వం, అద్భుత నైపుణ్యాలు కలిగి అత్యుత్తమ క్రికెట్‌ ఆడితే తిరిగి పుంజుకోవడం పెద్ద కష్టమేం కాదు. టీమ్‌ఇండియా ఇలా ఎన్నోసార్లు నిరూపించుకుంది. మేం రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఓడిపోయాం. అభిమానులు బాధపడ్డారని అంగీకరిస్తా’’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు