WPL: ముంబయికి షాక్.. ప్రతీకారం తీర్చుకున్న దిల్లీ క్యాపిటల్స్
మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబయి ఇండియన్స్ను ఓడించి దిల్లీ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టును దిల్లీ 29 పరుగుల తేడాతో ఓడించింది.
దిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians Women) కు దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals Women) షాక్ ఇచ్చింది. 29 పరుగుల తేడాతో ఆ జట్టుపై ఘన విజయం సాధించింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. అమన్జోత్ కౌర్ (42), మాథ్యస్ (29), సజనా (24*) మినహా మిగతావారు విఫలం అయ్యారు. దిల్లీ బౌలర్లలో జెస్ జొనాసెన్ మూడువికెట్లు తీయగా, మారిజానె కాప్ రెండు వికెట్లు పడగొట్టింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ.. జెమీమా (69), కెప్టెన్ మెగ్ లానింగ్ (53) అర్ధశతకాలతో రాణించడంతో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. దిల్లీ బ్యాటర్లు మొదటి నుంచి జోరు చూపించారు. ఓపెనర్లు లానింగ్, షెఫాలి వర్మ(28)తో తొలి వికెట్కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఎలిస్ క్యాప్సే(28), మారిజాన్నె (11) ఫర్వాలేదనిపించారు. జెమీమా (69), జెస్ జొనాసెన్(4) పరుగులతో నాటౌట్గా నిలిచారు. ముంబయి బౌలర్లలో షబ్నిమ్, సైకా ఇషాకీ, పూజా వస్త్రాకర్, హేలీ మ్యాథ్యూస్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.