రోడ్డెక్కిన కుస్తీ యోధులు
భారత రెజ్లింగ్లో కలకలం. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ అనేకమంది అగ్రశ్రేణి రెజ్లర్లు అసాధారణ రీతిలో రోడ్డెక్కారు.
రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వినేశ్ ఆరోపణ
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు దిగిపోవాలంటూ నిరసన
భారత రెజ్లింగ్లో కలకలం. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ అనేకమంది అగ్రశ్రేణి రెజ్లర్లు అసాధారణ రీతిలో రోడ్డెక్కారు. అతడు దిగిపోయేవరకు నిరసన కొనసాగుతుందని ప్రకటించారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడంటూ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిపై వినేశ్ ఫొగాట్ తీవ్రమైన ఆరోపణలు చేసింది.
దిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత బజ్రంగ్ పునియా, ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత వినేశ్ ఫొగాట్ సహా అనేక మంది మేటి రెజ్లర్లు దిల్లీలో నిరసనకు దిగారు. బ్రిజ్ భూషణ్ భాజపా ఎంపీ కూడా. జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన 30 మంది అథ్లెట్లలో బజ్రంగ్, వినేశ్తో పాటు రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత సరిత మోర్, సంగీత ఫొగాట్, సత్యవర్త్ మలిక్ కూడా ఉన్నారు. ‘‘మా పోరాటం ప్రభుత్వం లేదా క్రీడామంత్రిత్వ శాఖ లేదా భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్)పై కాదు. మా పోరాటం డబ్ల్యూఎఫ్ఐపైనే. మా పోరాటం ముగింపు వరకు కొనసాగుతుంది’’ అని బజ్రంగ్ పునియా అన్నాడు. ‘‘సమాఖ్య అధ్యక్షుణ్ని తొలగించేంత వరకు మేము ఎలాంటి అంతర్జాతీయ పోటీల్లో పోటీపడం. భారత రెజ్లింగ్ను కాపాడేందుకే ఈ పోరాటం. అధ్యక్షుణ్ని తప్పించేవరకు నిరసన కొనసాగిస్తాం. మాకు విదేశీ కోచ్ల మద్దతు లేదు. కానీ అధ్యక్షుడు తన అకాడమీలో మాత్రం విదేశీ కోచ్ను నియమించుకున్నాడు. అతడు రెజ్లర్లపై అసభ్య పదజాలాన్ని వాడాడు. దానికి సంబంధించిన వీడియోలు కూడా మా వద్ద ఉన్నాయి’’ అని అతడు చెప్పాడు. ‘‘దేశం తరఫున పతకాలు గెలవడానికి క్రీడాకారులు ఎంతో కృషి చేస్తున్నారు. మమ్మల్ని ఇబ్బందిపెట్టడం తప్ప సమాఖ్య చేసిందేమీ లేదు. అథ్లెట్లను వేధించడం కోసం అసంబద్ధమైన నిబంధనలు రూపొందించారు’’ అని సాక్షి మలిక్ ట్వీట్ చేసింది. ‘బాయ్కాట్ డబ్ల్యూఎఫ్ఐప్రెసిడెంట్’ అన్న హ్యాష్ట్యాగ్తో అన్షు మలిక్, సంగీత ఫొగాట్ కూడా దాదాపు ఇదే భావంతో ట్వీట్ చేశారు. బ్రిజ్ భూషణ్ 2011 నుంచి పదవిలో ఉంటున్నాడు. 2019 ఫిబ్రవరిలో మూడోసారి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడు: బ్రిజ్ భూషణ్ చాలా ఏళ్లుగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని వినేశ్ ఫొగాట్ ఆరోపించింది. ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా వెంటనే జోక్యం చేసుకుని అతణ్ని పదవి నుంచి తప్పించాలని కోరింది. లఖ్నవూలో జాతీయ శిబిరంలో అనేక మంది కోచ్లు మహిళా రెజ్లర్లను లైంగిక దోపిడీ చేశారని చెప్పింది. బ్రిజ్ భూషణ్ తరఫున శిబిరంలో కొంతమంది మహిళలు.. రెజ్లర్లను సంప్రదించారని అంది. అయితే తాను మాత్రం ఎలాంటి లైంగిక వేధింపులకు గురికాలేదని 28 ఏళ్ల వినేశ్ స్పష్టం చేసింది. ఓ బాధితురాలు ఇప్పుడు నిరసనలో పాల్గొన్నదని తెలిపింది. ‘‘డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు తమను లైంగికంగా వేధించాడని కనీసం 10-20 మంది రెజ్లర్లు నాతో చెప్పారు. వాళ్ల తమ కథలను నాతో చెప్పారు. వారి పేర్లను ఇప్పుడు నేను వెల్లడించలేను. ప్రధానమంత్రి, హోమంత్రిని కలిసే అవకాశం వస్తే మాత్రం చెబుతా’’ అని జంతర్ మంతర్ వద్ద నాలుగు గంటలపాటు నిరసన వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో వినేశ్ చెప్పింది. ‘‘డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడికి సన్నిహితులైన వ్యక్తుల నుంచి.. చంపేస్తామంటూ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ నిరసనకు దిగిన వారిలో ఎవరికి ఎలాంటి హాని జరిగినా బాధ్యత బ్రిజ్ భూషణ్దే’’ అని వ్యాఖ్యానించింది. తాను ధైర్యంగా మాట్లాడడం వల్ల తనపై ‘క్రమశిక్షణ లేని అథ్లెట్’ అన్న ముద్ర వేశారని వినేశ్ అంది. టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా అధికారిక జెర్సీని ధరించకపోవడంతో వినేశ్పై డబ్ల్యూఎఫ్ఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెపై నిషేధం విధించింది. కానీ వినేశ్ క్షమాపణలు చెప్పడంతో నిషేధాన్ని తొలగించింది. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో క్రీడల మంత్రిత్వ శాఖ స్పందించింది. 72 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్ఐని ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే జాతీయ క్రీడా నియమావళి ప్రకారం సమాఖ్యపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. బుధవారం ఆరంభంకావాల్సి ఉన్న జాతీయ శిబిరాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది.
ఆరోపణల్లో నిజం లేదు: భూషణ్
తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్ భూషణ్ తిరస్కరించాడు. పదవి నుంచి దిగిపోవడానికి నిరాకరించాడు. ‘‘నాపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు. నేనెందుకు వైదొలగాలి? ఒక్క మహిళ అయినా ముందుకొచ్చి లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువు చేస్తే ఉరి శిక్షకు సిద్ధం. నాపై ఓ పారిశ్రామికవేత్త కుట్ర చేస్తున్నాడు. ఈ ఆరోపణలపై సీబీఐ లేదా పోలీసులు దర్యాప్తు చేయొచ్చు. ఇదే రెజ్లర్లు ఒక వారం కింద నన్ను కలిశారు. ఏమీ చెప్పలేదు’’ అని చెప్పాడు. వినేశ్ను చంపుతామని తన తరఫున ఎవరో బెదరించారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ‘‘ఆమె పోలీసులను ఎందుకు సంప్రదించలేదు? ప్రధానమంత్రి లేదా క్రీడల మంత్రిని ఎందుకు కలవలేదు’’ అని బ్రిజ్ భూషణ్ అన్నాడు. ఇటీవల తెచ్చిన కొత్త నిబంధనలు అసౌకర్యం కలిగించడమే రెజ్లర్ల నిరసనకు కారణం కావొచ్చని చెప్పాడు. జాతీయ ఛాంపియన్షిప్లో ఆడాలని, సెలక్షన్ ట్రయల్స్కు హాజరుకావాలని రెజ్లర్లకు చెప్పడంలో తప్పులేదని అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అత్యుత్తమ వార్షిక జట్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. భారత్ ఎప్పటిలానే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
ముంబయితో మ్యాచ్కు ముందు ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అందరికంటే ఓ బ్యాటర్కు చాలా భయపడేవాడినని పేర్కొన్నాడు. -
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
వరల్డ్ కప్ కోసం స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడికే వైస్ కెప్టెన్సీని అప్పగించింది. -
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం