Ajinkya Rahane: మళ్లీ కౌంటీలకు రహానె

ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచ్‌తో టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేసిన సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానె.. మళ్లీ కౌంటీ బాట పట్టనున్నాడు.

Updated : 19 Jun 2023 08:27 IST

దిల్లీ: ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచ్‌తో టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేసిన సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానె.. మళ్లీ కౌంటీ బాట పట్టనున్నాడు. వచ్చే నెల వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా భారత్‌ రెండు టెస్టులాడనుంది. ఆ మ్యాచ్‌ల తర్వాత రహానె.. లీసెస్టర్‌షైర్‌ తరపున ఆడేందుకు ఇంగ్లాండ్‌ వెళ్లనున్నాడు. జనవరిలోనే లీసెస్టర్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అతను.. ఈ ఏడాది జూన్‌- సెప్టెంబర్‌ మధ్యలో ఆ జట్టు తరపున 8 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, రాయల్‌ లండన్‌ వన్డే కప్‌ ఆడాల్సి ఉంది. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఉండడంతో ఐపీఎల్‌ ముగిసిన వెంటనే అతను లీసెస్టర్‌షైర్‌తో కలవలేకపోయాడు. ‘‘వెస్టిండీస్‌లో రెండు టెస్టులు ముగిసిన తర్వాత రహానె నేరుగా ఇంగ్లాండ్‌ వెళ్లే అవకాశం ఉంది. అక్కడ మిగతా కౌంటీ సీజన్‌ కోసం అతను లీసెస్టర్‌షైర్‌ జట్టులో చేరతాడు. ఆగస్టులో రాయల్‌ లండన్‌ వన్డే కప్‌ ఆడతాడు. అలాగే సెప్టెంబర్‌లో ఓ నాలుగు కౌంటీ మ్యాచ్‌లూ ఆడే ఆస్కారముంది’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని