West Indies: విండీస్ నుంచి 2.. లఖ్నవూ నుంచి 16
వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించడంలో విఫలమై.. క్రికెట్లో పాతాళానికి పడిపోయిన నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్ల దృక్పథం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దిల్లీ: వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించడంలో విఫలమై.. క్రికెట్లో పాతాళానికి పడిపోయిన నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్ల దృక్పథం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లీగ్లు ఆడేందుకు సీనియర్ ఆటగాళ్లు హెట్మయర్, ఆండ్రి రసెల్, సునీల్ నరైన్ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నారు. నిరుడు విండీస్ బోర్డు 18 ఆటగాళ్లతో ప్రకటించిన కేంద్ర కాంట్రాక్టు జాబితాలో ఈ ముగ్గురు లేరు. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు వీళ్లంతా స్వచ్ఛందంగా కాంట్రాక్టులకు దూరంగా ఉన్నారు. నికోలస్ పూరన్ మాత్రం క్వాలిఫయర్స్లో బరిలో దిగి ఓ సెంచరీ కూడా చేశాడు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీలు డబ్బుల వర్షం కురిపిస్తుండటంతో పూరన్ ఇంకెన్నాళ్లు విండీస్కు ఆడతాడన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సీపీఎల్, బీబీఎల్తో పాటు మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) కూడా రాబోతుండటంతో విండీస్ జట్టుకు పూరన్ గుడ్బై చెప్పినా ఆశ్చర్యపోనవరం లేదు. ప్రస్తుతం ఐపీఎల్లో ఒక సీజన్కు లఖ్నవూ సూపర్ జెయింట్స్ అతనికి రూ.16 కోట్లు ఇస్తోంది. విండీస్ బోర్డు ఏడాదికి చెల్లించే మొత్తం (దాదాపు రూ.2 కోట్లు)తో పోలిస్తే ఇది 8 రెట్లు ఎక్కువ. రసెల్కు కోల్కతా నైట్రైడర్స్ రూ.16 కోట్లు, హెట్మయర్కు రాజస్థాన్ రాయల్స్ రూ.8.50 కోట్లు చెల్లిస్తోంది. బోర్డు నుంచి వచ్చే ఆదాయం కంటే వీరికి ఒక్క ఐపీఎల్ నుంచే ఎన్నో రెట్ల ఆదాయం అందుతోంది. 2017 గణాంకాల ప్రకారం విండీస్ బోర్డు టెస్టుకు రూ.4.72 లక్షలు, వన్డేకు రూ.1.88 లక్షలు, టీ20కి రూ.1.42 లక్షలు మ్యాచ్ ఫీజుగా చెల్లిస్తోంది. తాజాగా మ్యాచ్ ఫీజును పెంచినా.. భారత ఆటగాళ్లతో పోలిస్తే 3-4 రెట్లు తక్కువే. టెస్టుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.8 లక్షలు, టీ20కి రూ.4 లక్షలు బీసీసీఐ చెల్లిస్తోంది. కేంద్ర కాంట్రాక్టుల ప్రకారం రెండు ఫార్మాట్లో విండీస్కు ప్రాతినిధ్యం వహిస్తే ఏడాదికి రూ.1.97 కోట్లు లభిస్తాయి. మ్యాచ్ ఫీజులతో కలిపితే మూడు ఫార్మాట్లలో ఆడితే రూ.2.50 కోట్లు దక్కుతాయి. కానీ జాతీయ జట్టును విడిచిపెట్టి పూర్తిగా లీగ్లకే అంకితమైతే పది రెట్లకు తక్కువ కాకుండా ఆదాయం వస్తుండటంతో కరీబియన్ ఆటగాళ్లు అటువైపే చూస్తున్నారు. ఫలితమే తాజా దుస్థితి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు