ఆ స్పిన్నర్ల ఉచ్చులో కోహ్లి!
ప్రేమదాస స్టేడియంలో భారత స్టార్ విరాట్ కోహ్లీకి ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ వన్డేల్లో వరుసగా నాలుగు సెంచరీలు చేశాడు. అదే స్టేడియంలో పాకిస్థాన్పై అజేయ శతకంతో చెలరేగాడు.
కొలంబో
ప్రేమదాస స్టేడియంలో భారత స్టార్ విరాట్ కోహ్లీకి ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ వన్డేల్లో వరుసగా నాలుగు సెంచరీలు చేశాడు. అదే స్టేడియంలో పాకిస్థాన్పై అజేయ శతకంతో చెలరేగాడు. కానీ ఒక్క రోజు వ్యవధిలోనే అదే మైదానంలో పక్కనే ఉన్న పిచ్పై శ్రీలంకతో మ్యాచ్లో 3 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. స్పిన్కు చక్కగా అనుకూలించిన పిచ్పై ఎడమ చేతి వాటం ఆఫ్స్పిన్నర్ దునిత్ వెల్లలాగె బౌలింగ్లో అతను నిష్క్రమించాడు. ఇది ఒక్క ఇన్నింగ్సే కదా.. కోహ్లి మళ్లీ పుంజుకుంటాడనే ఆశలు పెట్టుకోవచ్చు. కానీ పదేపదే ఎడమ చేతి వాటం స్పిన్నర్ల ఉచ్చులో కోహ్లి పడుతుండటమే ఆందోళన కలిగిస్తోంది. కేశవ్ మహరాజ్ (దక్షిణాఫ్రికా), మిచెల్ శాంట్నర్ (న్యూజిలాండ్), షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), ఆష్టన్ అగర్ (ఆస్ట్రేలియా), ఇప్పుడు దునిత్.. వీళ్లందరూ వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. కానీ వీళ్ల మధ్య ఓ సారూప్యత ఉంది. అదే ఎడమ చేతి వాటం స్పిన్నర్లు. 2021 నుంచి వన్డేల్లో కోహ్లీని వీళ్లు ఔట్ చేశారు. కేశవ్, శాంట్నర్, షకిబ్ అయితే రెండేసి సార్లు కోహ్లీని పెవిలియన్ చేర్చారు. 2021 జనవరి నుంచి 28 వన్డేల్లో కోహ్లి ఎనిమిది సార్లు ఈ ఎడమ చేతి వాటం స్పిన్నర్లకే వికెట్ సమర్పించుకున్నాడు. ఈ బౌలర్ల బౌలింగ్లో 159 బంతులు ఆడిన అతను 104 పరుగులే చేశాడు. స్ట్రైక్రేట్ 65.4గానే ఉంది. ఎడమ చేతి వాటం స్పిన్నర్ల బౌలింగ్లో కోహ్లి చాలా ఇబ్బంది పడుతున్నాడనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. తాజాగా దునిత్ వెల్లలాగె బౌలింగ్లో కోహ్లి ఔటైన విధానం మరింత ఆందోళన కలిగిస్తోంది. పిచ్ స్పిన్కు సహకరిస్తోందని తెలిసి కోహ్లి నెమ్మదిగానే ఇన్నింగ్స్ ఆరంభించాడు. కానీ వలయం లోపల అదనపు ఫీల్డర్లను మోహరించడంతో స్ట్రైక్ రొటేట్ చేయడం కోహ్లీకి కష్టమైపోయింది. అతను స్వీప్ను ఎక్కువగా ఆడే ఆటగాడు కాదు. దీంతో డాట్బాల్స్ పెరిగిపోయాయి. పరుగులు సాధించాలనే ఉద్దేశంతో మిడ్వికెట్ మీదుగా షాట్ ఆడదామనుకున్నాడు. కానీ బంతిని తప్పుగా అంచనా వేసి శానక చేతికి చిక్కాడు. పార్ల్లో ఒకసారి ఇలాగే కేశవ్ బౌలింగ్ కోహ్లి ఔటయ్యాడు. మీర్పూర్లో షకిబ్ బౌలింగ్లో ఆఫ్సైడ్ ఇలాగే క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఆసియా కప్లో శుక్రవారం ప్రేమదాస మైదానంలోనే బంగ్లాదేశ్తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో కోహ్లి బలహీనతను సొమ్ము చేసుకునేందుకు కచ్చితంగా షకిబ్ ప్రయత్నిస్తాడనడంలో సందేహం లేదు. వచ్చే నెలలో భారత్లో వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతుంది. భారత్్ తన తొలి మ్యాచ్ చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడుతుంది. చెపాక్ పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందనే సంగతి తెలిసిందే. మరి అక్కడ లెఫ్టార్మ్ స్పిన్నర్ అగార్ను కోహ్లి ఎలా ఎదుర్కుంటాడనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఒక్క మ్యాచ్ అనే కాదు దాదాపు ప్రపంచకప్ మొత్తం కోహ్లీకి స్పిన్ సవాలు తప్పదు. అతని బలహీనతను అవకాశంగా మార్చుకోవడం కోసం ప్రత్యర్థి జట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాయి. మరి ఇప్పటికే ఎన్నో బలహీనతలను అధిగమించి, ఎప్పటికప్పుడూ ఆటతీరును మెరుగుపర్చుకుంటూ సాగుతున్న కోహ్లి ఈ సమస్య నుంచి కూడా బయట పడేందుకు మార్గం అన్వేషిస్తాడనే అంచనాలున్నాయి. ఎడమ చేతి వాటం స్పిన్నర్లపై కోహ్లి ఆధిపత్యం ప్రదర్శిస్తే అది అతనితో పాటు జట్టుకూ ఎంతో మేలు చేసేదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ మళ్లీ నెట్టింట ట్రెండింగ్లోకి వచ్చాడు. గౌతమ్ గంభీర్ చేసిన పోస్టూ వైరల్గా మారింది. -
ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్కు వర్షం ముప్పు
మే 18న చెన్నై, ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. -
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
సెలవుల్లో అమెరికా వెళ్లేందుకు తానెంతో ఇష్టపడతానంటూ టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. అందుకు గల కారణాలను వివరించాడు. -
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. రెండు బెర్తుల కోసం ఐదు టీమ్లు.. ఏ జట్టు పర్సంటేజీ ఎంతంటే?
మెగా లీగ్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఐదు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. -
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంటున్న వేళ.. మరో ఆసక్తికర మ్యాచ్ అభిమానులను అలరించేందుకు వస్తోంది. -
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
మ్యాచులన్నీ ముగిసినా.. ఇటు బయటకు వెళ్లలేని పరిస్థితి. అటు నాకౌట్ దశకు అర్హత దక్కుతుందో తెలియని సంకటస్థితి దిల్లీ జట్టుకు ఉంది. -
హెడ్ కోచ్గా కొనసాగమని కోరినా.. తిరస్కరించిన ద్రవిడ్
ద్రవిడ్ ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో కోచ్ పదవి నుంచి వైదలగాలని భావిస్తున్నాడు. కనీసం టెస్టు జట్టుకు కూడా అతడు కోచ్గా ఉండేందుకు నిరాకరించినట్లు సమాచారం. -
నా జీవితంలో ‘గోయెంకా - కేఎల్ రాహుల్’ ఎపిసోడ్ ఐదో సర్ప్రైజ్: లాంగర్
సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ - సంజీవ్ గోయెంకా సంభాషణ వైరల్గా మారిపోయింది. ఆ పరిణామాలపై లఖ్నవూ కోచ్ స్పందించాడు. -
పవర్ప్లేలో వికెట్లు కోల్పోవడం పెద్ద దెబ్బే: కేఎల్ రాహుల్
లఖ్నవూకు ఈ సీజన్లో ఏడో ఓటమి ఎదురైంది. ప్లేఆఫ్స్కు వెళ్దామనే ఆశలకు బ్రేక్ పడేలా ఉంది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
హార్దిక్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్.. వారిద్దరు ఐపీఎల్లో ఏం సాధించారు?: గంభీర్
హార్దిక్ నాయకత్వంపై విమర్శలు చేసిన విదేశీ మాజీ క్రికెటర్లను గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. ఐపీఎల్లో ఆ ఇద్దరి పాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. -
దిల్లీ విజయంతో..
దిల్లీ గెలుపుతో లీగ్ దశను ముగించింది. బ్యాటుతో పోరెల్, స్టబ్స్.. బంతితో ఇషాంత్ మెరిసిన వేళ లఖ్నవూను మట్టికరిపించింది. ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న దిల్లీ, సాంకేతికంగా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. -
ద్రవిడ్ స్థానంలో ఎవరు?
టీ20 ప్రపంచకప్తో రాహుల్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో బీసీసీఐ కొత్త ప్రధాన కోచ్ వేటను మొదలెట్టింది. ఇప్పటికే ఆ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఆసక్తికర అంశం. -
అగ్రస్థానంలో మను
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను బాకర్ అగ్రస్థానం సాధించింది. మంగళవారం ఆఖరిదైన నాలుగో ట్రయల్స్లో ఆమె విజేతగా నిలిచింది. -
ఆ నిబంధన మంచిదే
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను చాలా మంది ఆటగాళ్లు, నిపుణులు విమర్శిస్తుంటే, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం అది మంచిదే అంటున్నాడు. ఆ నిబంధన వల్ల మ్యాచ్లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు. -
ఆ ట్రోఫీని వేలం వేయొద్దు
1986 ఫుట్బాల్ ప్రపంచకప్లో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా సాధించిన ‘గోల్డెన్బాల్ ట్రోఫీ’ని వేలం వేయొద్దని అతడి వారసులు కోర్టుకెక్కనున్నారు. -
టాప్సీడ్గా అర్జున్
యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశికి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ లభించింది. ఇటీవల వార్సాలో ముగిసిన సూపర్బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీని అయిదో స్థానంలో ముగించిన అర్జున్.. -
మనిక @ 24
భారత టేబుల్టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఆమె 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ఫైనల్లో ‘లక్ష్య’ శ్రీనివాస్
ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ మెరిశాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో అతడు ఫైనల్కు దూసుకెళ్లాడు. -
సెమీస్లో గౌరవ్
ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో గౌరవ్ చౌహాన్ పతకం ఖాయం చేశాడు. 92 కేజీల పైన విభాగంలో అతడు సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. మంగళవారం క్వార్టర్స్లో గౌరవ్ 3-2తో డానియల్ స్పార్బే (కజకిస్థాన్)ను ఓడించాడు.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
-
తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి
-
మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు గుడ్న్యూస్.. కేవైసీ నిబంధనల్లో సడలింపు
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!