ట్రాక్పై రయ్రయ్
భారత్లో మొట్టమొదటి సారి నిర్వహిస్తున్న మోటోజీపీ రేసుకు రంగం సిద్ధమైంది. బుద్ధ్ అంతర్జాతీయ సర్క్యూట్లో మోటోజీపీలో భాగంగా ఇండియన్ఆయిల్ గ్రాండ్ ప్రి రేసు ఆదివారం జరుగుతుంది
గ్రేటర్ నోయిడా: భారత్లో మొట్టమొదటి సారి నిర్వహిస్తున్న మోటోజీపీ రేసుకు రంగం సిద్ధమైంది. బుద్ధ్ అంతర్జాతీయ సర్క్యూట్లో మోటోజీపీలో భాగంగా ఇండియన్ఆయిల్ గ్రాండ్ ప్రి రేసు ఆదివారం జరుగుతుంది. శుక్రవారం ప్రాక్టీస్ రేసులు జరిగాయి. శనివారం ప్రాక్టీస్తో పాటు అర్హత రేసులు నిర్వహిస్తారు. ప్రధానంగా మోటోజీపీ (24 ల్యాప్లు), మోటో2 (19 ల్యాప్లు), మోటో3 (17 ల్యాప్లు) రేసులు అభిమానులను అలరించబోతున్నాయి.
నసీమ్ ఔట్
ప్రపంచకప్కు పాక్ జట్టు
లాహోర్: భారత్లో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. యువ పేసర్ నసీమ్ షాకు చోటు దక్కలేదు. ఆసియాకప్లో టీమ్ఇండియాతో మ్యాచ్లో అతడు గాయపడ్డాడు. త్వరలో శస్త్ర చికిత్స చేయించుకోబోతున్న అతడు కోలుకోవడానికి 3-4 నెలల సమయం పట్టనుంది. నసీమ్ స్థానంలో హసన్ అలీ జట్టులోకి వచ్చాడు.
పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ఖాన్ (వైస్ కెప్టెన్), రిజ్వాన్, ఇమాముల్ హక్, షఫీఖ్, షకీల్, ఫకార్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తికార్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్, ఆగా సల్మాన్, షహీన్షా అఫ్రిది, ఒసామా మీర్
ప్రపంచకప్ విజేతకు రూ.33 కోట్లు
దుబాయ్: వన్డే ప్రపంచకప్ కైవసం చేసుకునే జట్టు సుమారు రూ.33 కోట్లు నగదు బహుమతిగా పొందబోతోంది. ఈ విషయాన్ని శుక్రవారం ఐసీసీ వెల్లడించింది. రన్నరప్కు రూ.16 కోట్లు లభించనున్నాయి. సెమీఫైనల్లో ఓడే రెండు జట్లు రూ.6 కోట్ల చొప్పున అందుకుంటాయి. నాకౌట్ చేరడంలో విఫలమయ్యే ఒక్కో జట్టుకు రూ.82 లక్షలు.. లీగ్ దశలో మ్యాచ్లో విజేతగా నిలిచే జట్లకు రూ.33 లక్షల చొప్పున బహుమతి అందనుంది. ప్రపంచకప్కు ఐసీసీ మొత్తం రూ.82 కోట్లు ప్రైజ్మనీగా కేటాయించింది. భారత్ వేదికగా అక్టోబర్ 5న ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీలో లీగ్ దశలో 45 మ్యాచ్లు, నాకౌట్లో 3 మ్యాచ్లు జరుగుతాయి.
కరీబియన్ దీవుల్లో ఏడు వేదికలు
దుబాయ్: 2024 టీ20 ప్రపంచకప్ కోసం కరీబియన్ దీవుల్లో ఏడు వేదికలను ఐసీసీ ఎంపిక చేసింది. వచ్చే ఏడాది జూన్ 4న ఆరంభమయ్యే ఈ మెగా ఈవెంట్కు ఆంటిగ్వా అండ్ బార్బాడా, బార్బడోస్, డొమినికా, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనాడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మ్యాచ్లకు వేదికలుగా నిలవనున్నాయి. ఈ కప్ను వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్లను ఐసీసీ వేదికలుగా ఎంపిక చేసింది. 20 జట్లు తలపడే టీ20 ప్రపంచకప్లో మొత్తం 55 మ్యాచ్లు జరుగుతాయి.
అఫ్గాన్.. రెండు వైపుల నుంచి
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో అఫ్గానిస్తాన్ క్రీడాకారుల పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. క్రీడాకారులది ఒకే దేశమైనా భిన్నమైన ప్రాంతాల నుంచి రావడమే ఇందుకు కారణం. అఫ్గాన్పై తాలిబన్లు నియంత్రణ సాధించిన తర్వాత జరుగుతున్న తొలి ఆసియా క్రీడలు ఇవే. తాలిబన్ల పాలనలో క్రీడల్లో మహిళలపై విధించగా.. అక్కడ్నుంచి 130 మంది పురుషులతో ఒక బృందం ఆసియా క్రీడల్లో పాల్గొంటుంది. వాలీబాల్, జూడో, రెజ్లింగ్ సహా 17 క్రీడాంశాల్లో ఈ జట్టు బరిలో దిగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అఫ్గాన్ క్రీడాకారులతో మరో బృందం ఆసియా క్రీడల్లో పాల్గొంటుంది. అందులో 17 మంది మహిళా అథ్లెట్లు కూడా ఉన్నారు. తాలిబన్ల పాలనకు ముందు ఏర్పడిన అఫ్గాన్ జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు హఫీజుల్లా వలీ రహీమి ఈ బృందాన్ని చైనాకు తీసుకొచ్చాడు. ఇరాన్లో వాలీబాల్, ఇటలీలో సైక్లింగ్, ఆస్ట్రేలియాలో అథ్లెటిక్స్లో క్రీడాకారిణులు శిక్షణ తీసుకుంటున్నట్లు రహీమి వివరించాడు. మరి నిర్వాహకులు ఒకే జాతీయ జెండా కింద రెండు బృందాలకు అనుమతిస్తారా? ఏ జట్టును గుర్తిస్తారు? అన్నది చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్