ట్రాక్పై రయ్రయ్
భారత్లో మొట్టమొదటి సారి నిర్వహిస్తున్న మోటోజీపీ రేసుకు రంగం సిద్ధమైంది. బుద్ధ్ అంతర్జాతీయ సర్క్యూట్లో మోటోజీపీలో భాగంగా ఇండియన్ఆయిల్ గ్రాండ్ ప్రి రేసు ఆదివారం జరుగుతుంది
గ్రేటర్ నోయిడా: భారత్లో మొట్టమొదటి సారి నిర్వహిస్తున్న మోటోజీపీ రేసుకు రంగం సిద్ధమైంది. బుద్ధ్ అంతర్జాతీయ సర్క్యూట్లో మోటోజీపీలో భాగంగా ఇండియన్ఆయిల్ గ్రాండ్ ప్రి రేసు ఆదివారం జరుగుతుంది. శుక్రవారం ప్రాక్టీస్ రేసులు జరిగాయి. శనివారం ప్రాక్టీస్తో పాటు అర్హత రేసులు నిర్వహిస్తారు. ప్రధానంగా మోటోజీపీ (24 ల్యాప్లు), మోటో2 (19 ల్యాప్లు), మోటో3 (17 ల్యాప్లు) రేసులు అభిమానులను అలరించబోతున్నాయి.
నసీమ్ ఔట్
ప్రపంచకప్కు పాక్ జట్టు
లాహోర్: భారత్లో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. యువ పేసర్ నసీమ్ షాకు చోటు దక్కలేదు. ఆసియాకప్లో టీమ్ఇండియాతో మ్యాచ్లో అతడు గాయపడ్డాడు. త్వరలో శస్త్ర చికిత్స చేయించుకోబోతున్న అతడు కోలుకోవడానికి 3-4 నెలల సమయం పట్టనుంది. నసీమ్ స్థానంలో హసన్ అలీ జట్టులోకి వచ్చాడు.
పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ఖాన్ (వైస్ కెప్టెన్), రిజ్వాన్, ఇమాముల్ హక్, షఫీఖ్, షకీల్, ఫకార్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తికార్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్, ఆగా సల్మాన్, షహీన్షా అఫ్రిది, ఒసామా మీర్
ప్రపంచకప్ విజేతకు రూ.33 కోట్లు
దుబాయ్: వన్డే ప్రపంచకప్ కైవసం చేసుకునే జట్టు సుమారు రూ.33 కోట్లు నగదు బహుమతిగా పొందబోతోంది. ఈ విషయాన్ని శుక్రవారం ఐసీసీ వెల్లడించింది. రన్నరప్కు రూ.16 కోట్లు లభించనున్నాయి. సెమీఫైనల్లో ఓడే రెండు జట్లు రూ.6 కోట్ల చొప్పున అందుకుంటాయి. నాకౌట్ చేరడంలో విఫలమయ్యే ఒక్కో జట్టుకు రూ.82 లక్షలు.. లీగ్ దశలో మ్యాచ్లో విజేతగా నిలిచే జట్లకు రూ.33 లక్షల చొప్పున బహుమతి అందనుంది. ప్రపంచకప్కు ఐసీసీ మొత్తం రూ.82 కోట్లు ప్రైజ్మనీగా కేటాయించింది. భారత్ వేదికగా అక్టోబర్ 5న ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీలో లీగ్ దశలో 45 మ్యాచ్లు, నాకౌట్లో 3 మ్యాచ్లు జరుగుతాయి.
కరీబియన్ దీవుల్లో ఏడు వేదికలు
దుబాయ్: 2024 టీ20 ప్రపంచకప్ కోసం కరీబియన్ దీవుల్లో ఏడు వేదికలను ఐసీసీ ఎంపిక చేసింది. వచ్చే ఏడాది జూన్ 4న ఆరంభమయ్యే ఈ మెగా ఈవెంట్కు ఆంటిగ్వా అండ్ బార్బాడా, బార్బడోస్, డొమినికా, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనాడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మ్యాచ్లకు వేదికలుగా నిలవనున్నాయి. ఈ కప్ను వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్లను ఐసీసీ వేదికలుగా ఎంపిక చేసింది. 20 జట్లు తలపడే టీ20 ప్రపంచకప్లో మొత్తం 55 మ్యాచ్లు జరుగుతాయి.
అఫ్గాన్.. రెండు వైపుల నుంచి
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో అఫ్గానిస్తాన్ క్రీడాకారుల పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. క్రీడాకారులది ఒకే దేశమైనా భిన్నమైన ప్రాంతాల నుంచి రావడమే ఇందుకు కారణం. అఫ్గాన్పై తాలిబన్లు నియంత్రణ సాధించిన తర్వాత జరుగుతున్న తొలి ఆసియా క్రీడలు ఇవే. తాలిబన్ల పాలనలో క్రీడల్లో మహిళలపై విధించగా.. అక్కడ్నుంచి 130 మంది పురుషులతో ఒక బృందం ఆసియా క్రీడల్లో పాల్గొంటుంది. వాలీబాల్, జూడో, రెజ్లింగ్ సహా 17 క్రీడాంశాల్లో ఈ జట్టు బరిలో దిగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అఫ్గాన్ క్రీడాకారులతో మరో బృందం ఆసియా క్రీడల్లో పాల్గొంటుంది. అందులో 17 మంది మహిళా అథ్లెట్లు కూడా ఉన్నారు. తాలిబన్ల పాలనకు ముందు ఏర్పడిన అఫ్గాన్ జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు హఫీజుల్లా వలీ రహీమి ఈ బృందాన్ని చైనాకు తీసుకొచ్చాడు. ఇరాన్లో వాలీబాల్, ఇటలీలో సైక్లింగ్, ఆస్ట్రేలియాలో అథ్లెటిక్స్లో క్రీడాకారిణులు శిక్షణ తీసుకుంటున్నట్లు రహీమి వివరించాడు. మరి నిర్వాహకులు ఒకే జాతీయ జెండా కింద రెండు బృందాలకు అనుమతిస్తారా? ఏ జట్టును గుర్తిస్తారు? అన్నది చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్
ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో తలపడేందుకు టీమ్ఇండియా (IND vs SA) సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది పొట్టి కప్ నేపథ్యంలో ఈ మ్యాచ్లు అత్యంత కీలకం. -
David Warner: మిచెల్కు కౌంటర్.. నా తల్లిదండ్రుల గొప్ప పెంపకంలో ఎదిగా: వార్నర్
ఒకప్పుడు ఆసీస్ జట్టు (Cricket Australia) కోసం కలిసి ఆడిన వారిద్దరూ తాజాగా మాటల యుద్ధానికి దిగారు. ప్రస్తుతం ఒకరు మాజీ కాగా.. మరొకరు ఓపెనర్గా కొనసాగుతున్నారు. -
T10 League: ఇదేం బ్యాటింగ్ గురూ.. 43 బంతుల్లో 193 పరుగులా?
క్రికెట్లో రికార్డులు అధిగమించడం సహజమే. అయితే, ఒక్కో ఇన్నింగ్స్లో కేవలం 60 బంతులు మాత్రమే ఉండే టీ10 ఫార్మాట్లో హాఫ్ సెంచరీనే కష్టమనుకుంటే.. సెంచరీతోపాటు ద్విశతకానికి కాస్త చేరువగా రావడం నెట్టింట వైరల్గా మారిపోయింది. -
ICC: వరల్డ్ కప్ ‘ఫైనల్’ పిచ్ యావరేజ్.. వివాదాస్పదమైన భారత్-కివీస్ సెమీస్ ‘పిచ్’ రేటింగ్ ఎంతంటే?
భారత్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) పిచ్ల రిపోర్ట్ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇందులో టీమ్ఇండియా ఆడిన లీగ్లతోపాటు రెండు సెమీస్లు, ఫైనల్ మ్యాచ్ నివేదికలు ఉన్నాయి. -
Sreesanth: ‘ఫిక్సర్’ వ్యాఖ్యలు.. శ్రీశాంత్కు లీగల్ నోటీసులు
మైదానంలో భారత మాజీ క్రికెటర్లు ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో లీగ్ నిర్వాహకులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. -
SA vs IND : దక్షిణాఫ్రికా పర్యటన.. ఇప్పుడీ సిరీస్లతో భారత్కు కలిగే ప్రయోజనాలివే..
విదేశీ గడ్డపై తొలిసారి సిరీస్లు ఆడేందుకు యువ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా (SA vs IND) సిద్ధమైంది. -
Virat Kohli: విరాట్ నిర్ణయం ఏమిటో?
నిరుడు టీ20 ప్రపంచకప్ సెమీస్లో భారత ఓటమి తర్వాత రోహిత్, కోహ్లి తిరిగి పొట్టి ఫార్మాట్లో ఆడలేదు. -
IPL 2024: గుజరాత్ టైటాన్స్కు మరో షాక్ తప్పదా! షమి ఫ్రాంఛైజీ మారతాడా?
గుజరాత్ టైటాన్స్కు మరో షాక్ తగిలే అవకాశముంది. ఆ జట్టు ప్రధాన పేసర్ మహ్మద్ షమి (Mohammed Shami) ఫ్రాంఛైజీ మారే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. -
IND vs SA: రేసులోకి వచ్చేదెవరో?
ఓపెనర్ ఎవరు? మూడో స్థానంలో వచ్చేదెవరు? వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడేదెవరు? ఫినిషర్ దొరికేశాడా? యువ స్పిన్నర్ అవకాశం పట్టేస్తాడా? -
జైపుర్-బెంగాల్ సగం సగం
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో తొలి టై. జైపుర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ చివరికి 28-28తో సమమైంది. -
విజృంభించిన కరన్, లివింగ్స్టన్
వెస్టిండీస్తో తొలి వన్డేలో ఓడిన ఇంగ్లాండ్ పుంజుకుంది. సామ్ కరన్ (3/33), లివింగ్స్టన్ (3/39) విజృంభించడంతో రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. -
Sreesanth - Gambhir: గంభీర్ నన్ను ఫిక్సర్ అన్నాడు
టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తనను ఫిక్సర్ అన్నాడని మాజీ పేసర్ శ్రీశాంత్ గురువారం ఆరోపించాడు. -
NeeraJ Chopra: అందుకు నీరజే కారణం
భారత అథ్లెటిక్స్లో జరుగుతున్న మంచి విషయాలకు నీరజ్ చోప్రానే కారణమని, అతణ్ని ఆరాధిస్తానని సహచర జావెలిన్ త్రో అథ్లెట్ కిశోర్ కుమార్ పేర్కొన్నాడు. -
కోహ్లికి శతకాల సెంచరీ కష్టమే
విరాట్ కోహ్లికి 100 అంతర్జాతీయ సెంచరీలు చేయడం తేలికేం కాదని వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా అన్నాడు. -
స్పెయిన్ చేతిలో భారత్ ఓటమి
జూనియర్ హాకీ ప్రపంచకప్ తొలి మ్యాచ్లో కొరియాపై ఘన విజయం సాధించిన భారత జట్టుకు చేదు అనుభవం. -
అథ్లెట్లకు కఠోర ఆర్మీ శిక్షణ
వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్లో తమ దేశ అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేసే దిశగా వాళ్ల మానసిక సామర్థ్యాన్ని పెంచేందుకు దక్షిణ కొరియా ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. -
అజిత్కు రెండో స్థానం
అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) గ్రాండ్ప్రి-2 వెయిట్లిఫ్టింగ్ ఈవెంట్లో నారాయణ్ అజిత్ (73 కేజీ) గ్రూప్-సిలో రెండో స్థానంలో నిలిచాడు. -
డబ్ల్యూపీఎల్ కమిటీ అధ్యక్షుడిగా రోజర్
మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) అభివృద్ధి కోసం బీసీసీఐ ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.


తాజా వార్తలు (Latest News)
-
ఐటీ సోదాల్లో ₹220 కోట్లు స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న మోదీ
-
Chandrababu: రైతుల కష్టాలు జగన్కు ఏం తెలుసు?: చంద్రబాబు
-
Vadhuvu: రివ్యూ: వధువు.. అవికా గోర్ నటించిన వెబ్సిరీస్ ఎలా ఉందంటే?
-
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ
-
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి