Asian Games 2022: ఆసియాను గెలవాలని
నాలుగేళ్లకోసారి జరిగే క్రీడా సంబరం.. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ తర్వాత ఎంతో ప్రాధాన్యం ఉన్న పెద్ద క్రీడా పండుగ! ఆసియా దేశాల మధ్య ఆటల్లో ఆధిపత్యం కోసం సమరం!
ఏషియాడ్కు సిద్ధమైన భారత్
పతకాల సెంచరీపై మన అథ్లెట్ల కన్ను
నేడే చైనాలో అధికారిక ప్రారంభోత్సవం
నాలుగేళ్లకోసారి జరిగే క్రీడా సంబరం.. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ తర్వాత ఎంతో ప్రాధాన్యం ఉన్న పెద్ద క్రీడా పండుగ! ఆసియా దేశాల మధ్య ఆటల్లో ఆధిపత్యం కోసం సమరం! అథ్లెట్ల మధ్య పతకాల యుద్ధం! అందుకు వేదిక ఆసియా క్రీడలు. మరోసారి ఈ మెగా క్రీడలకు తరుణం ఆసన్నమైంది. అద్భుతమైన నైపుణ్యాలతో.. అచ్చెరువొందే విన్యాసాలతో.. అలుపెరగని పోరాటంతో.. పతకాల వేటలో సాగేందుకు అథ్లెట్లు సై అంటున్నారు. ఇప్పటికే వివిధ క్రీడల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. శనివారం అధికారికంగా ఈ క్రీడలు ఆరంభమవుతాయి. కరోనా తర్వాత జరుగుతున్న అతి పెద్ద క్రీడా ఈవెంట్లో పతకాల సెంచరీ కొట్టేందుకు నీరజ్ చోప్రా సారథ్యంలోని భారత అథ్లెట్ల బృందం సిద్ధమైంది. ఊరిస్తున్న పారిస్ ఒలింపిక్స్ బెర్తులు ఈ క్రీడలను మరింత ప్రత్యేకంగా మార్చేశాయ్. ఇక అక్టోబర్ 8 వరకు ఆటలే ఆటలు!
హాంగ్జౌ
19వ ఆసియా క్రీడలకు చైనా ముస్తాబైంది. ఇప్పటికే ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్, రోయింగ్, సెయిలింగ్, పెంటథ్లాన్లో పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడా గ్రామం సందడిగా మారింది. నేడు అధికారిక ఆరంభోత్స కార్యక్రమంతో క్రీడల సందడి మరోస్థాయికి చేరనుంది. అధికారికంగా ఈ నెల 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ క్రీడలు జరుగుతాయి. నిజానికి 2022లో ఈ క్రీడలు జరగాల్సింది. చైనాలో కరోనా కేసులు కారణంగా ఓ ఏడాది వాయిదా వేశారు. అయినప్పటికీ వీటిని 2022 ఆసియా క్రీడలుగానే వ్యవహరిస్తున్నారు. 2018లో 70 (16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలు) పతకాలు గెలిచిన భారత్.. ఈ సారి వంద పతకాలు సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. 1986 నుంచి భారత్ టాప్-5లో నిలవలేదు. కానీ ఈ సారి చరిత్ర తిరగరాయాలనే సంకల్పంతో మన అథ్లెట్లున్నారు. 39 క్రీడల్లో 655 మంది అథ్లెట్లు పతకాల వేటకు సై అంటున్నారు. శనివారం సాయంత్రం 5.30కు మొదలయ్యే ఆరంభ వేడుకల్లో లవ్లీనా, హర్మన్ప్రీత్ సింగ్ (హాకీ కెప్టెన్) భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు.
అథ్లెటిక్స్పై ఆశలు..
ఆసియా క్రీడల్లో ఈ సారి రికార్డు స్థాయిలో పతకాలు గెలిచేందుకు సిద్ధమైన భారత్.. ప్రధానంగా అథ్లెటిక్స్పైనే ఆశలు పెట్టుకుంది. అథ్లెటిక్స్లోనే సింహభాగం పతకాలు వచ్చే అవకాశముంది. 2018లో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు 8 స్వర్ణాలు సహా 20 పతకాలు గెలిచారు. ఈ సారి కనీసం 25 పతకాలు గెలుస్తారనే అంచనాలున్నాయి. భారత్ స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా 2018లో గెలిచిన పసిడిని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. తెలుగమ్మాయిలు నందిని (హెప్టథ్లాన్), జ్యోతి యర్రాజి (100మీ.హార్డిల్స్, 200మీ.పరుగు), తేజస్విన్ శంకర్ (డెకథ్లాన్), తజిందర్పాల్ (షాట్పుట్), మురళీ శ్రీశంకర్, శైలి సింగ్ (లాంగ్జంప్), అవినాశ్ సాబ్లె, పారుల్ చౌదరి (3000మీ. స్టీపుల్ఛేజ్), ప్రవీణ్ చిత్రవేల్ (ట్రిపుల్ జంప్)తో పాటు రిలే జట్లూ పతకాలు గెలిచే అవకాశాలున్నాయి. హాకీ, కబడ్డీ, క్రికెట్లో పురుషుల, మహిళల స్వర్ణాలు భారత్ ఖాతాలోనే చేరే ఆస్కారముంది. గత క్రీడల్లో రెండు స్వర్ణాలు సహా 9 పతకాలు గెలిచిన షూటర్లు.. అదే జోరు కొనసాగించాలని చూస్తున్నారు. షట్లర్లు, ఆర్చర్లు, బాక్సర్లు, రెజ్లర్లు కూడా బంగారు పతకాలపై కన్నేశారు.
తొలిసారి..
ఆసియా క్రీడల్లో తొలిసారి ఈ- స్పోర్ట్స్, బ్రేక్ డ్యాన్సింగ్ను చేర్చారు. 2018లో ఈ- స్పోర్స్ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ సారి అధికారికంగా పోటీలు నిర్వహిస్తున్నారు. 2010, 2014 తర్వాత మళ్లీ క్రికెట్ను చేర్చారు. 2018 విరామం తర్వాత చెస్, గో, జియాంగ్క్వీ తిరిగొచ్చాయి.
ఒలింపిక్స్ కంటే ఎక్కువ..
ప్రపంచంలో ఒలింపిక్స్ అత్యున్నత బహుళ క్రీడా టోర్నీ. కానీ ఒలింపిక్స్ కంటే ఆసియా క్రీడల్లోనే ఎక్కువ మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ సారి హాంగ్జౌలో 45 దేశాల నుంచి 12 వేలకు పైగా అథ్లెట్లు పతకాల కోసం పోటీపడుతున్నారు. రెండేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో 11 వేలకు పైగా బరిలో దిగారు. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్లో దాదాపు 10,500 మంది తలపడనున్నారు. 2018 ఆసియా క్రీడల్లో సుమారు 11 వేల మంది అథ్లెట్లు పోటీపడ్డారు. ఇప్పుడా సంఖ్య దాటింది. ఈ సారి 40 క్రీడలకు సంబంధించి 61 క్రీడాంశాల్లో 481 స్వర్ణాలు గెలుచుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. ఆతిథ్య చైనా నుంచి 886 మంది అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. 2010లో ఆ దేశం అత్యధికంగా 977 మందిని బరిలో దింపింది. అథ్లెట్ల సంఖ్యలోనే కాదు పతకాల పట్టికలోనూ చైనాదే ఆధిపత్యం. 1982 నుంచి ప్రతి సారి ఆ దేశానిదే అగ్రస్థానం.
క్వార్టర్స్లో భారత వాలీబాల్ జట్టు
ఆసియా క్రీడల వాలీబాల్లో భారత పురుషుల జట్టు క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం భారత్ 3-0 (25-22, 25-22, 25-21)తో చైనీస్ తైపీపై విజయం సాధించింది. తొలి మ్యాచ్లో దక్షిణ కొరియాను చిత్తుచేసిన భారత్.. ఆదివారం జరిగే పోరులో జపాన్ లేదా కజకిస్థాన్తో తలపడుతుంది. మరోవైపు రోయింగ్లో భారత ఆటగాడు బల్రాజ్ పన్వర్ ఫైనల్-ఎలో అడుగుపెట్టాడు. శుక్రవారం పురుషుల సింగిల్ స్కల్ ఎఫ్ ఎ/బి2 సెమీస్లో పన్వర్ మూడో స్థానం (7 నిమిషాల 22.22 సెకన్లు)లో నిలిచాడు. ఫైనల్-ఎలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన రోయర్లకు పతకాలు లభిస్తాయి. టేబుల్ టెన్నిస్లోనూ భారత జట్లు శుభారంభం చేశాయి. పురుషుల విభాగం గ్రూపు-ఎఫ్ మ్యాచ్ల్లో భారత్ వరుసగా 3-0తో యెమెన్, 3-1తో సింగపూర్పై విజయాలు నమోదు చేసింది.
ముగ్గురు అథ్లెట్లపై చైనా వివక్ష
దిల్లీ: ఆసియా క్రీడలకు ఆతిథ్యమిస్తున్న చైనా.. ముగ్గురు భారత అథ్లెట్ల పట్ల వివక్ష చూపించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అరుణాచల్ప్రదేశ్ వుషు క్రీడాకారిణులు నైమన్ వాంగ్సు, ఒనిలు టెగా, మెపుంగ్ లాంగుకు క్రీడల్లో పాల్గొనేందుకు చైనా గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ప్రదేశ్ను చైనా పూర్తిగా తన భూభాగంగా పరిగణిస్తోంది. గుర్తింపు కార్డుల నిరాకరణపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసనను తెలియజేసింది. చైనా వివక్షాపూరిత ప్రవర్తనకు నిరసనగా కేంద్ర సమాచార, ప్రసార, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆ దేశ పర్యటన (ఆసియా క్రీడల కోసం)ను రద్దు చేసుకున్నారు.
3
ఆసియా క్రీడలకు చైనా ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. 1990లో బీజింగ్లో, 2010లో గాంగ్జౌలో ఈ క్రీడలు జరిగాయి.
672
ఆసియా క్రీడల చరిత్రలో భారత్ ఇప్పటివరకూ గెలిచిన పతకాలు. ఇందులో 155 స్వర్ణాలు, 201 రజతాలు, 316 కాంస్యాలున్నాయి. ఓవరాల్గా భారత్ అయిదో స్థానంలో ఉంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఇరాన్ వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
6
ఆసియా క్రీడలు జరిగే నగరాలు. హాంగ్జౌతో పాటు హుజౌ, నింగ్బో, షావోజింగ్, జిన్వా, వెంజౌలో క్రీడలు నిర్వహిస్తున్నారు. మొత్తం 44 వేదికల్లో పోటీలుంటాయి.
* ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన అయిదుగురు భారత అథ్లెట్లు బరిలో ఉండటం ఆసియా క్రీడల చరిత్రలో ఇదే తొలిసారి. నీరజ్ చోప్రా, పీవీ సింధు, బజ్రంగ్ పునియా, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహెయిన్ ఒలింపిక్స్ పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే.
19
ఇవి 19వ ఆసియా క్రీడలు. 1951లో మొట్టమొదటి సారి భారత్లోనే ఆసియా క్రీడలు జరిగాయి. 1954 తర్వాత నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈ సారి కరోనా కారణంగా ఓ ఏడాది ఆలస్యంగా జరుగుతున్నాయి. 1982లోనూ ఈ క్రీడలకు భారత్ ఆతిథ్యమిచ్చింది.
రూ.11,610 కోట్లు
ఆసియా క్రీడల నిర్వహణ కోసం సుమారుగా చైనా చేస్తున్న ఖర్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..