IND vs AUS: షమి.. భగభగ
కోహ్లి లేడు.. రోహిత్ లేడు.. పాండ్య లేడు.. కుల్దీప్ లేడు.. ప్రపంచకప్లో ఎంతో కీలకమైన ఈ ఆటగాళ్లు లేకుండా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అదరగొట్టింది టీమ్ఇండియా.
నిప్పులు చెరిగిన పేసర్
మెరిసిన శుభ్మన్,రుతురాజ్
తొలి వన్డేలో ఆసీస్పై భారత్ విజయం
కోహ్లి లేడు.. రోహిత్ లేడు.. పాండ్య లేడు.. కుల్దీప్ లేడు.. ప్రపంచకప్లో ఎంతో కీలకమైన ఈ ఆటగాళ్లు లేకుండా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అదరగొట్టింది టీమ్ఇండియా. సీనియర్ ఫాస్ట్బౌలర్ షమి చాన్నాళ్ల తర్వాత తన పేస్ అస్త్రాలను బయటికి తీయడంతో మొహాలిలో భారత్కు తిరుగులేకపోయింది. షమి అయిదు వికెట్ల ప్రదర్శన చేయడంతో కంగారూలను ఓ మోస్తరు స్కోరుకు పరిమితం చేసిన టీమ్ఇండియా.. యువ ఓపెనర్లు శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ల వీరవిహారంతో మ్యాచ్ను తనవైపు తిప్పేసుకుంది. వీళ్లిద్దరూ వెనుదిరిగాక కొంత తడబడ్డా.. చివరికి విజయం భారత్దే.
మొహాలి
ప్రపంచకప్ ముంగిట టీమ్ఇండియా మరో స్ఫూర్తిదాయక విజయం సాధించింది. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకుండా దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన భారత్.. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సంపాదించింది. మొదట ఆసీస్ సరిగ్గా 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మహ్మద్ షమి (5/51) ఆ జట్టును దెబ్బ తీశాడు. వార్నర్ (52; 53 బంతుల్లో 6×4, 2×6) టాప్స్కోరర్గా నిలవగా.. జోష్ ఇంగ్లిస్ (45; 45 బంతుల్లో 3×4, 2×6), స్టీవ్ స్మిత్ (41; 60 బంతుల్లో 3×4, 1×6), లబుషేన్ (39; 49 బంతుల్లో 3×4) తలో చేయి వేశారు. ఛేదనలో శుభ్మన్ గిల్ (74; 63 బంతుల్లో 6×4, 2×6), రుతురాజ్ గైక్వాడ్ (71; 77 బంతుల్లో 10×4) జట్టుకు అదిరే ఆరంభాన్నివ్వగా.. సూర్యకుమార్ (50; 49 బంతుల్లో 5×4, 1×6) అండతో కెప్టెన్ కేఎల్ రాహుల్ (58 నాటౌట్; 63 బంతుల్లో 4×4, 1×6) మిగతా పని పూర్తి చేశాడు. భారత్ 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా (2/57) రాణించాడు. రెండో వన్డే ఆదివారం ఇండోర్లో జరుగుతుంది.
ఏకపక్షం అనుకుంటే..: ఛేదనలో భారత్కు దక్కిన ఆరంభం చూస్తే.. మ్యాచ్ 49వ ఓవర్ వరకు వెళ్తుందని, ఆస్ట్రేలియాకు గెలుపు మీద కాస్త ఆశ అయినా కలుగుతుందని, భారత్ 5 వికెట్లు కోల్పోతుందని ఎవ్వరూ అనుకుని ఉండరు. సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ శుభ్మన్ గిల్.. ఆసియా క్రీడల్లో జట్టును నడిపించేముందు అనుకోకుండా అవకాశం దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు గొప్ప ఆరంభాన్నిచ్చారు. ఆస్ట్రేలియా బ్యాటర్లు కష్టపడి పరుగులు సాధించిన పిచ్పై ఈ ఇద్దరూ అలవోకగా బ్యాటింగ్ చేశారు. పోటీ పడి షాట్లు కొట్టారు. దీంతో 10 ఓవర్ల తొలి పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసిన భారత్.. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించి 21 ఓవర్లకు 136/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. చూడముచ్చటైన షాట్లతో అలరించిన గిల్ 37 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అతడితో పోలిస్తే నెమ్మదిగా ఆడిన రుతురాజ్ 60 బంతుల్లో ఆ మార్కును అందుకున్నాడు. ఒక్క వికెట్టూ పడకుండానే లక్ష్యంలో సగం పైగా కరిగిపోవడంతో ఆసీస్ చిత్తుగా ఓడుతుందనిపించింది. కానీ స్పిన్నర్ జంపా.. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లిద్దరినీ ఔట్ చేసి ఆసీస్కు ఉపశమనాన్నిచ్చాడు. మధ్యలో శ్రేయస్ అయ్యర్ (3) చేజేతులా రనౌటయ్యాడు. దీంతో 142/0 నుంచి భారత్ 151/3కి చేరుకుంది. ఈ స్థితిలో ఇషాన్ (18)తో రాహుల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. క్రీజులో కుదురుకుంటున్న దశలో ఇషాన్ ఔటైనా భారత్కు ఇబ్బంది లేకపోయింది. సూర్యకుమార్ తొలిసారి వన్డేల్లో ఎక్కువసేపు క్రీజులో నిలిచి అర్ధశతకం సాధించడం.. రాహుల్ క్రీజులో పాతుకుపోవడంతో ఛేదన సాఫీగానే సాగిపోయింది. 21 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన స్థితిలో సూర్య ఔటైనా.. రాహుల్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
షమి అదరహో: అంతకుముందు పేస్కు అనుకూలంగా కనిపించిన పిచ్ను ఉపయోగించుకునే ఉద్దేశంతో టాస్ గెలిచిన టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ రాహుల్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత పేసర్లు అతడి నమ్మకాన్ని నిలబెట్టారు. ముఖ్యంగా పిచ్లో వేగం ఉంటే తాను ఎంత ప్రమాదకరమో షమి చూపించాడు. ఇటీవల స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్న ఈ సీనియర్ పేసర్.. శుక్రవారం పదునైన బంతులతో రెచ్చిపోయాడు. శరవేగంగా దూసుకొచ్చిన అతడి బంతులను ఆడటం ఆసీస్ బ్యాటర్ల వల్ల కాలేదు. ఇన్నింగ్స్ నాలుగో బంతికే షమి వికెట్ల ఖాతా తెరిచాడు. ఆఫ్ స్టంప్ మీద సంధించిన బంతిని ఆడబోయి మిచెల్ మార్ష్ స్లిప్లో శుభ్మన్కు దొరికిపోయాడు. మరో ఎండ్లో బుమ్రా కూడా బ్యాటర్లకు అవకాశమివ్వలేదు. వరుసగా రెండు మెయిడెన్లతో మొదలుపెట్టిన అతను.. మరో ఓపెనర్ వార్నర్ను బాగా ఇబ్బంది పెట్టాడు. స్టీవ్ స్మిత్ కూడా ఆరంభంలో ఆచితూచి ఆడాడు. కానీ ఈ జోడీ కుదురుకున్నాక స్వేచ్ఛగా పరుగులు రాబట్టింది. ముఖ్యంగా వార్నర్ చెలరేగి ఆడి అర్ధశతకం సాధించాడు. 18 ఓవర్లకు 98/1తో పుంజుకుంది. అయితే క్రీజులో బాగా నిలదొక్కుకున్న వార్నర్, స్మిత్ స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో ఆసీస్కు మళ్లీ ఇబ్బందులు తప్పలేదు. వార్నర్ను జడేజా పెవిలియన్ చేర్చగా.. స్మిత్ను షమి బౌల్డ్ చేశాడు. జడేజాకు తోడు అశ్విన్ సైతం కట్టుదిట్టంగా బంతులేయడంతో స్కోరు వేగం కూడా పడిపోయింది. ఈ స్థితిలో లబుషేన్, గ్రీన్ (31) ఇన్నింగ్స్ను మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. వీళ్లిద్దరూ వెనుదిరిగాక 40 ఓవర్లకు 187/5తో నిలిచిన ఆసీస్.. 260 చేస్తే ఎక్కువ అనిపించింది. కానీ ఇంగ్లిస్, స్టాయినిస్ (29; 21 బంతుల్లో 5×4) ధాటిగా ఆడటంతో ఒక దశలో 300కు చేరువయ్యేలా కనిపించింది. అయితే షమి చివరి స్పెల్లో 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీసి కంగారూలను మరోమారు గట్టి దెబ్బ కొట్టాడు. కమిన్స్ (21 నాటౌట్; 9 బంతుల్లో 2×4, 1×6) మెరుపులతో ఆసీస్ 270 దాటింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: మిచెల్ మార్ష్ (సి) శుభ్మన్ (బి) షమి 4; వార్నర్ (సి) శుభ్మన్ (బి) జడేజా 52; స్టీవ్ స్మిత్ (బి) షమి 41; లబుషేన్ (స్టంప్డ్) రాహుల్ (బి) అశ్విన్ 39; గ్రీన్ రనౌట్ 31; ఇంగ్లిస్ (సి) శ్రేయస్ (బి) బుమ్రా 45; స్టాయినిస్ (బి) షమి 29; షార్ట్ (సి) సూర్యకుమార్ (బి) షమి 2; కమిన్స్ నాటౌట్ 21; సీన్ అబాట్ (బి) షమి 2; జంపా రనౌట్ 2; ఎక్స్ట్రాలు 8 మొత్తం: (50 ఓవర్లలో ఆలౌట్) 276; వికెట్ల పతనం: 1-4, 2-98, 3-112, 4-157, 5-186, 6-248, 7-250, 8-254, 9-256; బౌలింగ్: షమి 10-1-51-5; బుమ్రా 10-2-43-1; శార్దూల్ 10-0-78-0; అశ్విన్ 10-0-47-1; జడేజా 10-0-51-1
భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ ఎల్బీ (బి) జంపా 71; శుభ్మన్ (బి) జంపా 74; శ్రేయస్ రనౌట్ 3; రాహుల్ నాటౌట్ 58; ఇషాన్ (సి) ఇంగ్లిస్ (బి) కమిన్స్ 18; సూర్యకుమార్ (సి) మార్ష్ (బి) అబాట్ 50, జడేజా నాటౌట్ 3; ఎక్స్ట్రాలు 4 మొత్తం: (48.4 ఓవర్లలో 5 వికెట్లకు) 281
వికెట్ల పతనం: 1-142, 2-148, 3-151, 4-185, 5-265; బౌలింగ్: కమిన్స్ 10-0-44-1; స్టాయినిస్ 5-0-40-0; అబాట్ 9.4-1-56-1; గ్రీన్ 6-0-44-0; షార్ట్ 8-0-39-0; జంపా 10-0-57-2
5/51
షమి గణాంకాలు. వన్డేల్లో అతడికిదే ఉత్తమ ప్రదర్శన. అతను అయిదు వికెట్ల ప్రదర్శన చేయడమిది రెండోసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అత్యుత్తమ వార్షిక జట్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. భారత్ ఎప్పటిలానే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
ముంబయితో మ్యాచ్కు ముందు ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అందరికంటే ఓ బ్యాటర్కు చాలా భయపడేవాడినని పేర్కొన్నాడు. -
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
వరల్డ్ కప్ కోసం స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడికే వైస్ కెప్టెన్సీని అప్పగించింది. -
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు