Icc World Cup 2023: భారత జట్టుకు ప్రధాని మోదీ ఓదార్పు

ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమితో తీవ్ర విచారంలో మునిగిపోయిన భారత ఆటగాళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఊరడించారు.

Updated : 21 Nov 2023 04:04 IST

దిల్లీ: ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమితో తీవ్ర విచారంలో మునిగిపోయిన భారత ఆటగాళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఊరడించారు. పరాజయం అనంతరం కొందరు భారత క్రికెటర్లు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే.  జట్టు డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లిన ప్రధాని.. పేసర్‌ షమిని కౌగిలించుకుని ఓదార్చారు. ఆటగాళ్లతో మాట్లాడారు. ‘‘దురదృష్టవశాత్తు ఆదివారం మా రోజు కాదు. టోర్నీ ఆసాంతం మా జట్టుకు మద్దతు తెలిపిన భారతీయులందరికీ నా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా డ్రెస్సింగ్‌రూమ్‌కు వచ్చి మమ్మల్ని ఉత్సాహపరిచిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మేం పుంజుకుంటాం’’ అని షమి సోమవారం ఎక్స్‌లో పేర్కొన్నాడు. మోదీ కూడా ఎక్స్‌లో భారత జట్టును ఉద్దేశించి ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘ప్రియమైన టీమ్‌ఇండియా.. ప్రపంచకప్‌లో మీ ప్రతిభ, పట్టుదల గుర్తుంచుకోదగ్గవి. మీరు గొప్ప ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేశారు. ఈ రోజు, ఎల్లప్పుడూ మీకు మద్దతుగా ఉంటాం’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని