Icc World Cup 2023: భారత జట్టుకు ప్రధాని మోదీ ఓదార్పు
ప్రపంచకప్ ఫైనల్లో ఓటమితో తీవ్ర విచారంలో మునిగిపోయిన భారత ఆటగాళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఊరడించారు.
దిల్లీ: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమితో తీవ్ర విచారంలో మునిగిపోయిన భారత ఆటగాళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఊరడించారు. పరాజయం అనంతరం కొందరు భారత క్రికెటర్లు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. జట్టు డ్రెస్సింగ్రూమ్కు వెళ్లిన ప్రధాని.. పేసర్ షమిని కౌగిలించుకుని ఓదార్చారు. ఆటగాళ్లతో మాట్లాడారు. ‘‘దురదృష్టవశాత్తు ఆదివారం మా రోజు కాదు. టోర్నీ ఆసాంతం మా జట్టుకు మద్దతు తెలిపిన భారతీయులందరికీ నా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా డ్రెస్సింగ్రూమ్కు వచ్చి మమ్మల్ని ఉత్సాహపరిచిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మేం పుంజుకుంటాం’’ అని షమి సోమవారం ఎక్స్లో పేర్కొన్నాడు. మోదీ కూడా ఎక్స్లో భారత జట్టును ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ప్రియమైన టీమ్ఇండియా.. ప్రపంచకప్లో మీ ప్రతిభ, పట్టుదల గుర్తుంచుకోదగ్గవి. మీరు గొప్ప ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేశారు. ఈ రోజు, ఎల్లప్పుడూ మీకు మద్దతుగా ఉంటాం’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IND vs AUS: అంపైర్కు తగిలిన బంతి.. ఆసీస్ కెప్టెన్ రియాక్షన్ వైరల్
ఆసీస్ (AUS)తో జరిగిన ఐదో టీ20లో భారత్ (IND) ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. -
IND vs AUS: 10 పరుగులే చేసినా రికార్డు సృష్టించాడు.. వాళ్లు ఈ సిరీస్లో ప్రభావం చూపారు: వేడ్
ఆసీస్తో జరిగిన ఐదో టీ20లో భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) 10 పరుగులే చేసినా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. -
IND vs AUS: ముగింపు అదిరింది
ఆస్ట్రేలియాతో అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమ్ఇండియా 4-1తో సొంతం చేసుకుంది. ఆదివారం అయిదో మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మందకొడి పిచ్పై మొదట భారత్ 8 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. -
Virat Kohli: సఫారీ గడ్డపై కోహ్లి అదరగొడతాడు : ఏబీ డివిలియర్స్
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అదరగొడతాడని, అతని అత్యుత్తమ ప్రదర్శన చూస్తామని సఫారీ జట్టు మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాలో టీమ్ఇండియా మూడేసి చొప్పున టీ20లు, వన్డేలు, రెండు టెస్టులాడనుంది. -
David Warner: వార్నర్.. టెస్టుల్లో చివరిగా!
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్లో చివరగా పాకిస్థాన్తో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు వార్నర్ సిద్ధమయ్యాడు. ఈ నెల 14న పెర్త్లో ఆరంభమయ్యే తొలి టెస్టు కోసం ప్రకటించిన 14 మంది ఆటగాళ్ల జట్టులో అతనికి చోటు దక్కింది. -
హైదరాబాద్ విజయం
విజయ్ హజారె వన్డే టోర్నీలో హైదరాబాద్ పుంజుకుంది. గత మ్యాచ్లో మహారాష్ట్ర చేతిలో ఓడిన హైదరాబాద్.. విదర్భపై విజయం సాధించింది. ఆదివారం వర్షం ఆటంకం కలిగించిన గ్రూప్-బి మ్యాచ్లో హైదరాబాద్ 30 పరుగులతో (వీజేడీ పద్ధతిలో) నెగ్గింది. -
జెయింట్స్ జోరు
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో గుజరాత్ జెయింట్స్ జోరు ప్రదర్శిస్తోంది. సొంతగడ్డపై వరుసగా రెండో విజయంతో ఆ జట్టు సత్తాచాటింది. ఆదివారం హోరాహోరీగా సాగిన పోరులో జెయింట్స్ 34-31 తేడాతో బెంగళూరు బుల్స్ను ఓడించింది. -
ప్రపంచ అథ్లెటిక్స్కు భారత్ బిడ్
2029 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఆతిథ్యానికి భారత్ బిడ్ వేయనుంది. ఇంతకుముందు 2027 ప్రపంచ టోర్నీ ఆతిథ్యం పట్ల ఆసక్తి కనబరిచిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఇప్పుడు 2029 పోటీలపై దృష్టిసారించనుంది. ‘‘2029 ప్రపంచ ఛాంపియన్షిప్ ఆతిథ్యానికి బిడ్ వేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. -
Rinku Singh: రింకు రేసులో ఉన్నాడు కానీ..
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ రేసులో రింకు సింగ్ ఉన్నాడు కానీ.. అందుకు అతడు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. ‘‘2024 టీ20 ప్రపంచకప్ జట్టు రేసులో కచ్చితంగా రింకు సింగ్ కూడా ఉంటాడు. -
జాతీయ ఛాంపియన్షిప్కు అర్జున్, హాసిని
జాతీయ అండర్- 13 బాలబాలికల చెస్ ఛాంపియన్షిప్లో తలపడే తెలంగాణ జట్టులో ఆదిరెడ్డి అర్జున్, హాసిని చోటు దక్కించుకున్నారు. సోమవారం నుంచి సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ ఛాంపియన్షిప్ జరుగనుంది. -
యూరో ఛాంపియన్షిప్ డ్రా విడుదల
ఫుట్బాల్లో ఫిఫా ప్రపంచకప్ తర్వాత అత్యంత ఆదరణ ఉండే యూరోపియన్ ఛాంపియన్షిప్ డ్రా విడుదలైంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ టోర్నీకి వచ్చే ఏడాది జర్మనీ ఆతిథ్యమివ్వనుంది. ఐరోపాలోని అత్యుత్తమ దేశాలు ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. -
Team India: భారత్లో వాళ్లను క్షమించారు: రియాజ్
పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్ వాహబ్ రియాజ్కు సలహాదారుగా సల్మాన్ భట్ను నియమించడం ఆ దేశ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది. ఫిక్సింగ్కు పాల్పడి నిషేధాన్ని ఎదుర్కొన్న భట్కు హోదాను కల్పించినంద]ుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
క్రీడా పురస్కారాల ఎంపిక కమిటీ
దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల ఎంపిక కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్ సారథ్యం వహించనున్నారు. 12 మంది సభ్యుల కమిటీకి జస్టిస్ ఖన్విల్కర్ను ఛైర్మన్గా నియమిస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది.


తాజా వార్తలు (Latest News)
-
Mayawati: ఏకపక్ష ఫలితాలు ఆందోళనకరం: మాయావతి
-
Kriti Sanon: ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం.. చట్టపరమైన చర్యలు తీసుకున్న కృతి సనన్
-
Congress: సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత ఏఐసీసీ అధ్యక్షుడికి..: డీకే శివకుమార్
-
IND vs AUS: అంపైర్కు తగిలిన బంతి.. ఆసీస్ కెప్టెన్ రియాక్షన్ వైరల్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Maldives: మాల్దీవులు నుంచి దళాలు వెనక్కి.. అంగీకరించిన భారత్: మయిజ్జు