ఐసీసీ టీ20 జట్లలో స్మృతి మాత్రమే
2021 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన ఉత్తమ పురుష, మహిళల టీ20 జట్లలో కలిపి భారత్ నుంచి ఒక్కరికే చోటు దక్కింది. మహిళల జట్టులో స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు స్థానం లభించింది. గత ఏడాది ఆమె 9 టీ20ల్లో 31.87 సగటు,
పురుషుల్లో ఒక్కరికీ దక్కని చోటు
దుబాయ్: 2021 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన ఉత్తమ పురుష, మహిళల టీ20 జట్లలో కలిపి భారత్ నుంచి ఒక్కరికే చోటు దక్కింది. మహిళల జట్టులో స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు స్థానం లభించింది. గత ఏడాది ఆమె 9 టీ20ల్లో 31.87 సగటు, 131.44 స్ట్రైక్ రేట్తో 255 పరుగులు చేసి భారత మహిళల్లో టాప్ స్కోరర్గా నిలిచింది. 25 ఏళ్ల మంధాన నిరుడు రెండు అర్ధశతకాలు సాధించింది. ఐసీసీ మహిళల టీ20 జట్టుకు ఇంగ్లిష్ క్రికెటర్ నటాలీ సీవర్ కెప్టెన్గా ఎంపికైంది. పురుషుల జట్టులో ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కలేదు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్నే ఐసీసీ జట్టుకు సారథిగా ప్రకటించారు. అత్యధికంగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల నుంచి తలో ముగ్గురికి ఈ జట్టులో చోటు దక్కింది. వెస్టిండీస్ నుంచి ఎవరికీ అవకాశం రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం