సెమీస్‌లో మాళవిక

ఒడిషా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ క్రీడాకారిణి మాళవిక బాన్సోద్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్లో మాళవిక 21-13, 16-21, 21-17తో తాన్య హేమంత్‌పై విజయం

Published : 29 Jan 2022 02:09 IST

ఒడిషా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

కటక్‌: ఒడిషా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ క్రీడాకారిణి మాళవిక బాన్సోద్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్లో మాళవిక 21-13, 16-21, 21-17తో తాన్య హేమంత్‌పై విజయం సాధించింది. ఉన్నతి హుడా 21-10, 21-15తో సామియా ఇమాద్‌ ఫారూఖీపై, అష్మిత చాలిహ 21-17, 21-15తో రుచా సావంత్‌పై, స్మిత్‌ తోష్నివాల్‌ 8-21, 21-9, 21-14తో ఇషిక జైశ్వాల్‌ (అమెరికా)పై నెగ్గి సెమీస్‌ చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో మూడో సీడ్‌ శుభంకర్‌ డేకు కిరణ్‌ జార్జ్‌ షాకిచ్చాడు. కిరణ్‌ 21-16, 10-21, 21-19తో శుభంకర్‌పై గెలిచాడు. కౌశల్‌ ధర్మేందర్‌ 14-21, 21-18, 21-18తో అభ్యాంష్‌పై, ప్రియాంషు రజావత్‌ 13-21, 21-14, 21-8తో మిథున్‌ మంజునాథ్‌పై, అన్షల్‌ యాదవ్‌ 21-15, 23-21తో తరుణ్‌ మన్నెపల్లిపై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టారు. మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో గాయత్రి గోపీచంద్‌ పుల్లెల- ట్రీసా జాలీ జోడీ 21-7, 21-3తో వైష్ణవి- ఎల్లోరా జంటపై నెగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని