IPL 2022: మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌కు ఆలస్యంగా..

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ పర్యటనతో పాటు ఐపీఎల్‌ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ధ్రువీకరించాడు. మార్చిలో తన వివాహం

Updated : 17 Feb 2022 07:07 IST

సిడ్నీ: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ పర్యటనతో పాటు ఐపీఎల్‌ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ధ్రువీకరించాడు. మార్చిలో తన వివాహం జరగనున్నందున పాకిస్థాన్‌కు వెళ్లలేనని అతడు గతంలోనే చెప్పాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ మార్చి నెలాఖరులోనే ఆరంభమయ్యేలా ఉండటంతో డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, ప్యాట్‌ కమిన్స్‌, స్టాయినిస్‌, హేజిల్‌వుడ్‌, మాథ్యూ వేడ్‌, సామ్స్‌ కూడా 2022 ఐపీఎల్‌ మొదట్లో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది.

మమ్మల్ని అందుకే కొనలేదేమో!: ఈసారి ఐపీఎల్‌ వేలంలో తనతోపాటు ఆడమ్‌ జంపాను ఎవరూ కొనకపోవడంపై ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌ స్పందించాడు. నిరుడు కొవిడ్‌-19 కారణంగా టోర్నీ వాయిదా పడడానికి ముందు తాము లీగ్‌ను వీడడమే ఈసారి ఫ్రాంఛైజీలు తమపై ఆసక్తి చూపకపోవడానికి కారణం కావచ్చేమోనని అన్నాడు. ‘‘జంపాను ఎవరూ కొనుక్కోకపోవడం నాకు ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించింది. నిరుడు ఐపీఎల్‌ను వీడుతున్న సమయంలోనే ‘ఇలా వెళ్లడం మనకు ప్రతికూలంగా మారొచ్చు’ అని అతడితో చెప్పా. అప్పుడు మా ప్రాధాన్యత ఐపీఎల్‌ కాదు. మేము లీగ్‌కు వస్తామో లేదో అన్న ఉద్దేశంతో ఈసారి వేలంలో ఫ్రాంఛైజీలు మమ్మల్ని ఎంచుకుని ఉండకపోవచ్చు’’ అని రిచర్డ్‌సన్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని