భారత్‌ ఘన విజయం

అయిదు దేశాల అండర్‌-23 మహిళల హాకీ టోర్నమెంట్లో గురువారం జరిగిన పోరులో భారత్‌ 4-1 గోల్స్‌తో అమెరికాను చిత్తు చేసింది. అన్ను (49వ, 52వ ని) రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా..

Updated : 24 Jun 2022 03:24 IST

(ఫొటో సోర్స్: హాకీ ఇండియా ట్విటర్)

డబ్లిన్‌: అయిదు దేశాల అండర్‌-23 మహిళల హాకీ టోర్నమెంట్లో గురువారం జరిగిన పోరులో భారత్‌ 4-1 గోల్స్‌తో అమెరికాను చిత్తు చేసింది. అన్ను (49వ, 52వ ని) రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా.. నిఖిత టొప్పొ (48వ ని), వైష్ణవి (58వ ని) చెరో గోల్‌ కొట్టారు. అమెరికా తరఫున ఏకైక గోల్‌ను హన్నా మిల్లర్‌ (46వ ని) సాధించింది. మ్యాచ్‌లో నమోదైన అయిదు గోల్స్‌ను రెండు జట్లు చివరి 15 నిమిషాల్లోనే సాధించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని