ప్రిక్వార్టర్స్లో సింధు, కశ్యప్
సైనా ఓటమి
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ప్రిక్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ సింధు 21-13, 21-17తో పోర్న్పావీ చోచువాంగ్ (థాయ్లాండ్)పై విజయం సాధించింది. ఇటీవల ఇండోనేసియా ఓపెన్లో తొలి రౌండ్లోనే ఓడిన సింధు.. మలేసియా టోర్నీని కసిగా ప్రారంభించింది. 40 నిమిషాల పోరులో మొదటి గేమ్ ఏకపక్షంగా సాగింది. 8-2తో గేమ్ను ఆరంభించిన సింధు కొద్దిసేపటికే 16-13తో ముందంజ వేసింది. స్మాష్లు, క్రాస్కోర్ట్ షాట్లతో పాయింట్ల వేట కొసాగించిన సింధు 21-13తో తొలి గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్లో పోర్న్పావీ పోరాడింది. 4-2తో ఆధిక్యం సంపాదించిన ప్రత్యర్థి 13-8తో మరింత ముందుకెళ్లింది. సింధు అనవసర తప్పిదాలు ప్రత్యర్థికి లాభించాయి. దీంతో పోర్న్పావీ 16-10తో రెండో గేమ్ దిశగా పయనించింది. అయితే షటిల్పై నియంత్రణ తెచ్చుకున్న సింధు వరుసగా 5 పాయింట్లు గెలుచుకుని 15-16తో పోర్న్పావీని సమీపించింది. ప్రత్యర్థి సైతం 2 పాయింట్లు నెగ్గి 17-15తో గేమ్కు చేరువైంది. మరోసారి విజృంభించిన సింధు వరుసగా 6 పాయింట్లతో మ్యాచ్కు తెరదించింది. 21-17తో రెండో గేమ్ను కైవసం చేసుకుంది. పోర్న్పావీపై తన గెలుపోటముల రికార్డును 6-3తో మరింత మెరుగు పరుచుకుంది. ప్రిక్వార్టర్స్లో ఫిటయపోర్న్ చైవాన్ (థాయ్లాండ్)తో సింధు తలపడనుంది. మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సైనా 11-21, 17-21తో ఐరిస్ వాంగ్ (అమెరికా) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్స్ చేరుకున్నాడు. తొలి రౌండ్లో కశ్యప్ 21-12, 21-17తో క్వాంగ్ హీ (కొరియా)పై గెలుపొందాడు. ప్రిక్వార్టర్స్లో కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్)తో కశ్యప్ పోటీపడతాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్రెడ్డి- అశ్విని పొన్నప్ప 15-21, 21-19, 17-21తో రాబిన్- సెలెనా (నెదర్లాండ్స్) చేతిలో పోరాడి ఓడారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని- శిఖ 11-21, 14-21తో మత్సుమొటొ- నగహర (జపాన్) చేతిలో పరాజయం చవిచూశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్చేయండి
-
Ap-top-news News
Andhra News: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ధైర్య సాహసాలు.. సిక్కోలు అమ్మాయికి ప్రశంసలు
-
Crime News
Hyderbad News: కారు డ్రైవర్పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
-
Ts-top-news News
Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
-
Crime News
Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Allu Arjun: కల్యాణ్రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం