కివీస్‌దే సిరీస్‌

వెస్టిండీస్‌ మరో సిరీస్‌ కోల్పోయింది. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే చేజార్చుకుంది. బ్యాటర్లకు తోడు బౌలర్లూ విజృంభించడంతో కివీస్‌ 90 పరుగుల తేడాతో రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.

Published : 14 Aug 2022 03:53 IST

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌ మరో సిరీస్‌ కోల్పోయింది. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే చేజార్చుకుంది. బ్యాటర్లకు తోడు బౌలర్లూ విజృంభించడంతో కివీస్‌ 90 పరుగుల తేడాతో రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (76; 41 బంతుల్లో 4×4, 6×6), డారిల్‌ మిచెల్‌ (48; 20 బంతుల్లో 2×4, 4×6) చెలరేగడంతో మొదట కివీస్‌ 5 వికెట్లకు 215 పరుగులు చేసింది. డెవాన్‌ కాన్వే (42; 34 బంతుల్లో 2×4, 3×6)తో కలిసి మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించిన ఫిలిప్స్‌.. మిచెల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 83 పరుగులు రాబట్టి జట్టుకు భారీ స్కోరు అందించాడు. టీ20ల్లో కరీబియన్‌ గడ్డపై ఓ పర్యటక జట్టు సాధించిన అత్యధిక స్కోరు 215 కావడం విశేషం. భారీ లక్ష్యఛేదనలో విండీస్‌ 9 వికెట్లకు 125 పరుగులకే పరిమితమైంది. మిచెల్‌ శాంట్నర్‌ (3/15), మిచెల్‌ బ్రాస్‌వెల్‌ (3/15) ఆ జట్టును కట్టడి చేశారు. అభేద్యమైన పదో వికెట్‌కు హేడెన్‌ వాల్ష్‌ (10 నాటౌట్‌), మెకాయ్‌ (23 నాటౌట్‌) 38 పరుగులు జోడించడంతో విండీస్‌ స్కోరు 100 దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని