భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు
స్పెయిన్లో జరుగుతున్న ప్రపంచ యూత్ బాక్సింగ్ టోర్నీలో భారత్ పంచ్ అదిరింది. ఈ పోటీల్లో మూడు స్వర్ణాలు కైవసమయ్యాయి.
దిల్లీ: స్పెయిన్లో జరుగుతున్న ప్రపంచ యూత్ బాక్సింగ్ టోర్నీలో భారత్ పంచ్ అదిరింది. ఈ పోటీల్లో మూడు స్వర్ణాలు కైవసమయ్యాయి. విశ్వనాథ్ (48 కేజీ), వంశజ్ (63.5 కేజీ), దేవిక (52 కేజీ) పసిడి పతకాలతో మెరిశారు. రోనెల్ (ఫిలిప్ఫీన్స్)ను విశ్వనాథ్ ఓడించగా.. డెముర్ (జార్జియా)పై వంశజ్ నెగ్గాడు. సకాయ్ (జపాన్) చేతిలో పరాజయం పాలైన ఆశిష్ (54 కేజీ) రజతంతో సరిపెట్టుకున్నాడు. మహిళల విభాగంలో లౌరెన్ (ఇంగ్లాండ్)పై దేవిక పైచేయి సాధించగా.. గనెవా (ఉజ్బెకిస్థాన్) చేతిలో తలొంచిన భావ్నాశర్మ (48 కేజీ) రజతంతో సంతృప్తి పడింది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా మూడు స్వర్ణాలు సహా 11 పతకాలు సాధించిన భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మహిళల విభాగంలోనే మనకు ఎనిమిది పతకాలు దక్కడం విశేషం. రవీనా (63 కేజీ), కీర్తి (81 కేజీలపైన) పసిడి పోరుకు అర్హత సాధించిన నేపథ్యంలో మరో రెండు స్వర్ణాలు ఖాతాలో చేరే అవకాశాలున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Sports News
Harmanpreet Kaur: మా దృష్టి వేలంపై లేదు.. పాక్తో మ్యాచ్పైనే ఉంది: హర్మన్ ప్రీత్ కౌర్
-
India News
Assam: బాల్య వివాహాలు.. 3 రోజుల్లో 2,278మంది అరెస్టు
-
Politics News
Karnataka: ఇవే నా చివరి ఎన్నికలు.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం!
-
Movies News
NTR: నా భార్య కంటే ముందు మీకే చెబుతా.. దర్శక- నిర్మాతలపై ఒత్తిడి తేవొద్దు: ఎన్టీఆర్
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా