భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు
స్పెయిన్లో జరుగుతున్న ప్రపంచ యూత్ బాక్సింగ్ టోర్నీలో భారత్ పంచ్ అదిరింది. ఈ పోటీల్లో మూడు స్వర్ణాలు కైవసమయ్యాయి.
దిల్లీ: స్పెయిన్లో జరుగుతున్న ప్రపంచ యూత్ బాక్సింగ్ టోర్నీలో భారత్ పంచ్ అదిరింది. ఈ పోటీల్లో మూడు స్వర్ణాలు కైవసమయ్యాయి. విశ్వనాథ్ (48 కేజీ), వంశజ్ (63.5 కేజీ), దేవిక (52 కేజీ) పసిడి పతకాలతో మెరిశారు. రోనెల్ (ఫిలిప్ఫీన్స్)ను విశ్వనాథ్ ఓడించగా.. డెముర్ (జార్జియా)పై వంశజ్ నెగ్గాడు. సకాయ్ (జపాన్) చేతిలో పరాజయం పాలైన ఆశిష్ (54 కేజీ) రజతంతో సరిపెట్టుకున్నాడు. మహిళల విభాగంలో లౌరెన్ (ఇంగ్లాండ్)పై దేవిక పైచేయి సాధించగా.. గనెవా (ఉజ్బెకిస్థాన్) చేతిలో తలొంచిన భావ్నాశర్మ (48 కేజీ) రజతంతో సంతృప్తి పడింది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా మూడు స్వర్ణాలు సహా 11 పతకాలు సాధించిన భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మహిళల విభాగంలోనే మనకు ఎనిమిది పతకాలు దక్కడం విశేషం. రవీనా (63 కేజీ), కీర్తి (81 కేజీలపైన) పసిడి పోరుకు అర్హత సాధించిన నేపథ్యంలో మరో రెండు స్వర్ణాలు ఖాతాలో చేరే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు