Hardik: అక్కడ పొరపాటు చేశాం.. అహ్మదాబాద్లో అతడిని చూస్తానని ఆశిస్తున్నా: హార్దిక్
గుజరాత్ టైటాన్స్ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK) ఫైనల్కు చేరింది. ఈ క్రమంలో తమ ఓటమికిగల కారణాలను గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) లీగ్ స్టేజ్లో అదరగొట్టి ప్లేఆఫ్స్ చేరింది. అయితే, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో కీలక పోరుకు చేరిన గుజరాత్కు చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇచ్చింది. చెపాక్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్లో గుజరాత్ను ఓడించింది. ఛేదనలో ఎదురులేని గుజరాత్.. ఈసారి మాత్రం గెలవలేకపోయింది. ఇందులో ఓడిపోయినా ఫైనల్కు చేరుకొనేందుకు గుజరాత్కు మరొక అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో రెండో క్వాలిఫయర్లో తలపడనుంది. ఈ క్రమంలో చెన్నైపై ఓటమి గురించి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు.
‘‘బౌలింగ్లో మేం కాస్త అదుపు తప్పినట్లు అనిపించింది. కొన్ని తప్పిదాలు మా ఓటమికి కారణం. అద్భుతమైన బౌలింగ్ విభాగం ఉంది. అయినా, 15 పరుగులను అదనంగా ఇచ్చాం. కొన్ని బంతులను సరిగా వేయకపోవడంతోనే చెన్నై బ్యాటర్లు పరుగులు రాబట్టారు. మా ప్రణాళికలను పక్కాగా అమలు చేసినప్పటికీ.. ఇలా జరిగిపోయింది. అయితే, దీనిపై మరీ ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మరో రెండు మూడు రోజుల్లో మ్యాచ్ ఆడతాం. ఫైనల్కు చేరుకోవాలంటే అదనంగా మరో మ్యాచ్ను ఆడాల్సి ఉంటుంది. ఇక ఎంఎస్ ధోనీ వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బౌలర్లను అద్భుతంగా వినియోగించుకుంటాడు. రెండో క్వాలిఫయిర్లో గెలిచి ఆదివారం ధోనీతో ఆడితే బాగుంటుందని అనిపిస్తోంది. తప్పకుండా వచ్చే మ్యాచులో గెలుస్తాం. ఎలిమినేటర్ మ్యాచ్ను చూస్తా. అహ్మదాబాద్లో లఖ్నవూ కెప్టెన్ కృనాల్ పాండ్యను చూస్తానని ఆశిస్తున్నా’’ అని హార్దిక్ తెలిపాడు.
మరీ ప్రయోగాలకు పోలేదు: దీపక్ చాహర్
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ తన నాలుగు ఓవర్ల కోటాలో రెండు వికెట్లు తీసి 29 పరుగులు ఇచ్చాడు. ‘‘గుజరాత్ బౌలింగ్ను చూసిన తర్వాత లెంగ్త్తో బౌలింగ్ చేయాలని భావించాం. అదీనూ ఫుల్ లెంగ్త్లో సంధిస్తే ఫలితం రాబట్టవచ్చని అర్థమైంది. అందుకే, మరీ ఎక్కువగా ప్రయోగాలకు పోలేదు. 170 పరుగులను ఛేదించడం కష్టమేనని అనిపించింది. గతంలో ప్లేఆఫ్స్లో ఆడినప్పుడూ భారీగా వచ్చే ప్రేక్షకుల మధ్య ఆడటం చాలా ఒత్తిడితో కూడుకున్నదే. యువకులకు కేవలం ఒత్తిడిని ఎలా అధిగమించాలనే దానిపైనే సూచనలు చేశా. వారికున్న నైపుణ్యాలపై నమ్మకంతో ఉండాలని చెబుతా. కేవలం ఒక్క బంతి లేదా ఒక్క క్యాచ్ మ్యాచ్ను మార్చేస్తుంది. ఇప్పటికే మేం చాలాసార్లు ఫైనల్కు చేరాం. తప్పకుండా అక్కడా మంచి ప్రదర్శనే చేస్తాం’’ అని చాహర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు