Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
ప్రముఖ పుణ్యక్షేత్రం, కాశీ విశ్వనాథుడు కొలువైన వారణాసి (Varanasi)లో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ఈ స్టేడియానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మరికొన్ని నెలల్లో దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం, కాశీ విశ్వనాథుడు కొలువైన వారణాసి (Varanasi)లో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ స్టేడియానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షా, మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, రవిశాస్త్రి తదితరులు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
స్టేడియం విశేషాలు
ఈ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా డిజైన్ చేశారు. త్రిశూలాన్ని పోలిన ప్లడ్లైట్లు, శివుడి చేతిలో ఉండే ఢమరుకం రూపంలో పెవిలియన్ స్టాండ్ నిర్మించనున్నారు. గంగా ఘాట్ మెట్ల మాదిరిగా ప్రేక్షకుల గ్యాలరీ ఉండనుంది. స్టేడియం ప్రవేశ ద్వారంలో బిల్వ పత్రం ఆకును పోలిన మెటాలిక్ షీట్లను ఏర్పాటు చేయనున్నారు. పైకప్పు అర్ధ చంద్రాకారాన్ని ప్రతిబింబించనుంది. సూమారు 30,000 సీటింగ్ సామర్థ్యంతో స్టేడియాన్ని నిర్మించనున్నారు. ఈ స్టేడియం నిర్మాణానికి అవసరమైన 121 ఎకరాల భూసేకరణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.121 కోట్లు వెచ్చించింది. స్టేడియం నిర్మాణానికి రూ.330 కోట్లు ఖర్చుకానుంది. దీని నిర్మాణం పూర్తి అయితే కాన్పూర్, లఖ్నవూల తర్వాత ఉత్తరప్రదేశ్లో మూడో అంతర్జాతీయ స్టేడియం కానుంది. వారణాసిలోని రాజతలాబ్ ప్రాంతంలోని రింగ్ రోడ్కు సమీపంలో నిర్మించునున్న ఈ స్టేడియం 2025, డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IND vs AUS: మ్యాక్స్వెల్ ముంచేశాడు
ప్చ్.. పొట్టి సిరీస్లో భారత్కు తొలి పరాజయం. కొండంత స్కోరు చేసినా ఫలితం లేకపోయింది. రుతురాజ్ మెరుపు శతకం వృథా! సీనియర్లు లేని భారత బౌలింగ్ పరిమితులను ఎత్తిచూపుతూ మ్యాక్స్వెల్ విధ్వంసక బ్యాటింగ్తో విరుచుకుపడ్డ వేళ.. మూడో టీ20లో గెలిచిన ఆస్ట్రేలియా, సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. -
ruturaj gaikwad: అదే రోజు.. అదే బాదుడు
నవంబరు 28.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రుతురాజ్ ప్రపంచ రికార్డుతో చెలరేగాడు. విజయ్హజారె టోర్నమెంట్లో మహారాష్ట్రకు ఆడుతూ ఉత్తర్ప్రదేశ్పై 159 బంతుల్లోనే 220 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 16 సిక్స్లు, 10 ఫోర్లు ఉన్నాయి. -
మ్యాచ్లో ఓ మలుపు
వికెట్కీపర్ ఇషాన్కిషన్ చేసిన ఓ తప్పిదం ఆసీస్కు కలిసొచ్చింది. ఆ జట్టు 9 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన సమయంలో.. అక్షర్ పటేల్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతిని మాథ్యూ వేడ్ కాస్త ముందుకు వచ్చి ఆడబోయాడు. -
ముకేశ్కు పెళ్లి కళ
భారత పేసర్ ముకేశ్ కుమార్ పెళ్లి కొడుకయ్యాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో ఆడని అతడు గోరఖ్పుర్లో తన వివాహ వేడుక కోసం బీసీసీఐ అనుమతి తీసుకుని వెళ్లాడు. -
టీ20 ప్రపంచకప్కు నమీబియా
2024 టీ20 ప్రపంచకప్కు నమీబియా అర్హత సాధించింది. ఆఫ్రికా తరఫున పొట్టి కప్పు బెర్తు సంపాదించిన తొలి జట్టుగా నమీబియా నిలిచింది. మంగళవారం నమీబియా 58 పరుగుల ఆధిక్యంతో టాంజానియాపై విజయం సాధించింది. -
Jasprit Bumrah: బుమ్రా ‘మౌనం’ ఎందుకు?
బుమ్రా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కలకలం రేపింది. అతడు ముంబయి ఇండియన్స్ను వీడనున్నాడనే ఊహాగానాలు చెలరేగాయి. ‘‘కొన్నిసార్లు మౌనంగా ఉండడమే సరైన జవాబు’’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బుమ్రా పెట్టిన పోస్ట్తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చమొదలైంది. -
ఆసీస్ జట్టులో అనేక మార్పులు
భారత్తో టీ20 సిరీస్లో ఆడుతోన్న ఆస్ట్రేలియా జట్టులో అనేక మార్పులు జరిగాయి. చివరి రెండు మ్యాచ్లకు ముందు దాదాపు సగం ఆసీస్ జట్టు స్వదేశానికి వెళ్లిపోనుంది. వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్ మాత్రమే మిగిలిన రెండు టీ20ల కోసం భారత్లో ఉంటాడు. -
రాణించిన హసన్జాయ్
హసన్జాయ్ (86; 166 బంతుల్లో 11×4) రాణించడంతో న్యూజిలాండ్తో తొలి టెస్టులో బంగ్లా మొదటిరోజు ఆఖరికి తొలి ఇన్నింగ్స్లో 310/9 స్కోరు చేసింది. తైజుల్ (8), షోరిఫుల్ (13) క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాను హసన్ జాయ్ నడిపించాడు. -
అమ్మాయిలకు పరీక్ష
భారత మహిళల ‘ఏ’ జట్టుకు పరీక్ష. బుధవారం ఆరంభమయ్యే మూడు టీ20ల సిరీస్లో ఇంగ్లాండ్తో భారత్ తలపడనుంది. మిన్ను మణి సారథ్యంలోని టీమ్ఇండియాలో ప్రతిభావంతులకు కొదువ లేదు. తెలుగమ్మాయిలు జి.త్రిష, బారెడ్డి అనూషలకు సత్తా చాటేందుకు ఇదే మంచి అవకాశం. -
త్వరలోనే డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు
-
అదనపు పరిహారానికి పీసీబీ డిమాండ్
తమకు అదనపు పరిహారం చెల్లించాలంటూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)ను పీసీబీ డిమాండ్ చేస్తోంది. ఆసియా కప్ సమయంలో పాకిస్థాన్, శ్రీలంక మధ్య ప్రత్యేక విమానాల ఏర్పాట్లకు గాను అదనపు పరిహారం ఇవ్వాలని కోరుతోంది. -
ఐపీఎల్ ఆడాలని ఉంది
ఐపీఎల్లో ఆడాలని ఉందని పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ‘‘ప్రతి ఆటగాడు ఐపీఎల్కు రావాలని అనుకుంటారు. నేను కూడా అందుకు మినహాయింపు కాదు. ఎందుకంటే ప్రపంచంలోనే ఇది పెద్ద లీగ్. భవిష్యత్లో అవకాశం వస్తే కచ్చితంగా ఆడతా’’ అని హసన్ అలీ చెప్పాడు. -
కోచ్గా ద్రవిడే..!
టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడా..? -
Kapil Dev: ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు
ఎక్కువ ఆశలు పెట్టుకోవడం చేటు చేస్తుందని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. అభిమానులు అధిక ఒత్తిడి తెచ్చుకోవద్దని.. క్రికెట్ను ఒక క్రీడగా మాత్రమే పరిగణించాలని సూచించాడు. ‘‘ఎక్కువ ఆశలు పెట్టుకుంటే హృదయాలు ముక్కలవుతాయి. -
శీతల్ నం.1
రెండు చేతులు లేకపోయినా కాళ్ల సాయంతో విల్లును పట్టుకుని గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదిస్తున్న భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మరో ఘనత సాధించింది. మహిళల కాంపౌండ్ పారా ర్యాంకింగ్స్లో ఆమె రెండు స్థానాలు మెరుగుపరుచుకుని నంబర్వన్గా నిలిచింది.


తాజా వార్తలు (Latest News)
-
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
-
యూపీలో అపహరణ.. హైదరాబాద్లో అత్యాచారం
-
ఏపీకి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్పై ప్రశాంత్ నీల్ క్లారిటీ