Wrestling: ఆ నిషా స్వర్ణం గెలిచింది
జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో నిషా దహియా (రైల్వేస్) స్వర్ణ పతకంతో మెరిసింది. గురువారం 65 కేజీల విభాగంలో నిషా జాతీయ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో జస్ప్రీత్ కౌర్ (పంజాబ్)పై నిషా గెలుపొందింది.
జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్
గోండా (ఉత్తర్ప్రదేశ్): జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో నిషా దహియా (రైల్వేస్) స్వర్ణ పతకంతో మెరిసింది. గురువారం 65 కేజీల విభాగంలో నిషా జాతీయ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో జస్ప్రీత్ కౌర్ (పంజాబ్)పై నిషా గెలుపొందింది. బుధవారం ‘నిషా హత్యోదంతం’ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. హరియాణాకు చెందిన యూనివర్సిటీ స్థాయి రెజ్లర్ నిషా దహియా, ఆమె సోదరుడు సూరజ్ హత్యకు గురయ్యారు. అయితే అండర్-23 ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించిన నిషా హత్యకు గురైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తనకేమీ కాలేదంటూ నిషా వీడియో విడుదల చేసింది. ‘‘జాతీయ ఛాంపియన్షిప్లో సంతోషకరమైన ముగింపు ఇది. బుధవారం చాలా ఒత్తిడికి లోనయ్యా. నిద్ర కూడా పట్టలేదు. ఇప్పటికే బరువు తగ్గడంతో కాస్త బలహీనంగా ఉన్నా. హత్య వార్త మరింత ఒత్తిడికి గురిచేసింది’’ అని నిషా తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం