IPL 2023: అతడే అత్యుత్తమ ఫినిషర్.. మరెవరూ సాటిరారు: రియాన్ పరాగ్
క్లిష్టసమయాల్లో ఏమాత్రం బెరుకు లేకుండా మ్యాచ్ను ముగించేవాడిని ఫినిషర్ అంటాం. మరి ఇలాంటి కీలక పాత్ర పోషించే ఆటగాళ్లలో ఎవరు అత్యుత్తమం? అనే ప్రశ్న తలెత్తడం సహజం. ఐపీఎల్ (IPL 2023) కొత్త సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ కీలక విషయాలను వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL 2023) సందడి మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. జట్లన్నీ ప్రాక్టీస్ షురూ చేశాయి. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఆటగాళ్లంతా నెట్స్లో శ్రమిస్తున్నారు. టీ20 ఫార్మాట్లో ఫినిషర్ పాత్ర చాలా కీలకం. ప్రతి జట్టులోనూ లోయర్ ఆర్డర్లో ఇలాంటి ప్లేయర్ ఉంటాడు. ఈ కోవకు చెందిన ఆటగాడే రియాన్ పరాగ్ (Riyan Parag). గత సీజన్లలో క్లిష్టసమయాల్లో రాజస్థాన్ రాయల్స్ను గట్టెక్కించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, అతడి దృష్టిలో మాత్రం అత్యుత్తమ ఫినిషర్ మరొకరు ఉన్నారట. ఇంతకీ ఆ ‘ఫినిషర్’ మరెవరో కాదు.. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ. ఇదే విషయంపై రియాన్ పరాగ్ స్పందించాడు. అలాగే, ఫినిషర్ పాత్ర పోషించడంపై ఆనందం వ్యక్తం చేసిన రియాన్.. అవకాశం వస్తే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలనుందని తన మనసులో మాట బయటపెట్టాడు.
‘‘రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నన్ను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయమన్నా ఆడేందుకు సిద్ధంగా ఉంటా. అయితే, ఎంపిక చేసుకోమని అడిగితే మాత్రం రెండో డౌన్లో ఆడేందుకు ఆసక్తి చూపుతా. జట్టు అవసరాలకు తగ్గట్లుగా నేను ఎక్కడ ఫిట్ అవుతాననేది వారికి బాగా తెలుసు. కేవలం ఒకరిద్దరు ఆడితే మ్యాచ్ గెలవలేం. టీమ్ అంతా కలిసి కట్టుగా రాణించాలి. గత మూడేళ్లుగా ఫినిషర్ పాత్ర పోషించడం ఆనందంగా ఉంది. అయితే, అత్యుత్తమ ఫినిషర్ అని అంటే మాత్రం నాకు మొదట గుర్తుకొచ్చే పేరు ఎంఎస్ ధోనీ. అతడి స్థానంలో మరొక ఆటగాడిని అస్సలు ఊహించలేను. ధోనీ మ్యాచ్ను ఎలా అంత అద్భుతంగా ముగిస్తాడనేదానిని నిరంతరం గమనిస్తూనే ఉంటా’’ అని పరాగ్ తెలిపాడు.
గత సీజన్లో గొప్పగా రాణించలేకపోయిన పరాగ్.. ఈసారి మాత్రం మంచి ప్రదర్శన ఇస్తానని భరోసా ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్లో రాణించడం వల్లే నమ్మకంగా చెబుతున్నట్లు పేర్కొన్నాడు. ‘‘ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శనే చేశా. అందుకే, ఐపీఎల్లో రాణించగలనని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా. ఇప్పటికే జైపుర్లో మా కోసం కొన్ని క్యాంప్లు కూడా జరిగాయి. ప్రతి ఒక్కరూ బ్యాటింగ్, బౌలింగ్లో మంచి టచ్లోనే ఉన్నారు. నాలో ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. బౌలింగ్లోనూ తీవ్రంగా శ్రమించా. దేశవాళీ క్రికెట్ సీజన్లో ఈసారి దాదాపు 350 ఓవర్లపాటు బౌలింగ్ చేశా. జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్లోనూ నా సత్తా చాటుతా’’ అని పరాగ్ చెప్పాడు. మార్చి 31 నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 2వ తేదీ సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్ ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు