Sports News: టాప్లోనే అశ్విన్.. ప్రపంచ రికార్డు సృష్టించిన బాలీవుడ్ డైరెక్టర్ కుమారుడు
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అశ్విన్ అగ్రస్థానంలో నిలిచాడు. బాలీవుడ్ దర్శకుడు వినోద్ చోప్రా కుమారుడు అగ్ని చోప్రా రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇలాంటి క్రీడా విశేషాలు మీ కోసం..
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని నాలుగో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ ఉప్పల్లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో చెరో ఆరు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఆల్రౌండ్ ర్యాంకింగ్స్లో టాప్లో కొనసాగుతున్న జడేజా.. బౌలింగ్ విభాగంలో ఆరో స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్ విభాగం ర్యాంకింగ్స్లో భారత్ నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే టాప్-10లో నిలిచాడు. కోహ్లీ ఒక స్థానం మెరుగై 767 పాయింట్లతో ఆరో స్థానం దక్కించుకున్నాడు. భారత్తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 196 పరుగులు చేసిన ఓలీపోప్ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచాడు.
ప్రపంచ రికార్డు సృష్టించిన బాలీవుడ్ డైరెక్టర్ కుమారుడు
బాలీవుడ్ దర్శకుడు విధూ వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra) కుమారుడు అగ్ని చోప్రా (Agni Chopra) రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. మిజోరం తరఫున ఆడుతున్న ఈ 25 ఏళ్ల కుర్రాడు అరంగేట్ర సీజన్లోనే ఇప్పటివరకు ఐదు సెంచరీలు బాదాడు. ఈ క్రమంలోనే ఫస్టక్లాస్ క్రికెట్లో తొలి నాలుగు మ్యాచ్ల్లో సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో అగ్ని చోప్రా తల్లి అనుపమ్ చోప్రా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కుమారుడి రికార్డుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘‘తల్లిగా గర్విస్తున్నా’’ అని క్యాప్షన్ పెట్టింది. అగ్నిచోప్రా సిక్కింపై (166, 92), నాగాలాండ్పై (166, 15), అరుణాచల్ప్రదేశ్పై (114, 10), మేఘాలయపై (105, 101) స్కోర్లు నమోదు చేశాడు.
భారత డేవిస్ కప్ కెప్టెన్గా జీషన్ అలీ
భారత డేవిస్ కప్ కెప్టెన్గా జీషన్ అలీని నియమించారు. ఈవిషయాన్ని ఆల్ ఇండియా టెన్నిస్ ఫెడరేషన్ (ఏఐటీఏ) సెక్రటరీ జనరల్ అనిల్ ధూపర్ తెలిపారు. ‘‘కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మా నాన్ ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్పాల్ జట్టుతో కలిసి ప్రయాణించలేకపోయాడు. చాలా సీనియర్ ఆటగాడు అయిన జీషన్ అలీని జట్టుకు కెప్టెన్గా నియమించాం’’ అని అనిల్ ధూపర్ వెల్లడించారు. 60 ఏళ్ల తర్వాత భారత టెన్నిస్ జట్టు తొలిసారిగా పాకిస్థాన్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో భారత డేవిస్ కప్ జట్టుకు పాకిస్థాన్ పటిష్ట భద్రత కల్పించింది. అయిదంచెల భద్రతను భారత జట్టుకు కేటాయించారు. జీషన్ అలీ తండ్రి అక్తర్ 1964లో పాక్లో పర్యటించిన భారత జట్టులో కీలక ఆటగాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..