Shami: అప్పుడు తిండి కూడా సహించలేదు.. మోదీ వచ్చాకే మేం మాట్లాడుకున్నాం : షమీ
వన్డే ప్రపంచ కప్ ఫైనల్ (ODI World Cup 2023)లో ఓటమి తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఆటగాడితో సంభాషించారు. ఓటమి బాధను వీడి ముందుకు సాగాలని ధైర్యం చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో (ODI World Cup 2023) ఓటమితో యావత్ భారతావని నిరుత్సాహానికి గురైన సంగతి తెలిసిందే. ఇక ఆటగాళ్ల పరిస్థితి మాటల్లో చెప్పలేం. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జట్టు డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి వారిని పరామర్శించి.. ధైర్యం చెప్పడం మాత్రం ప్రతి భారతీయుడిలోనూ స్ఫూర్తి నింపింది. క్రికెటర్లు కూడా ప్రధాని మాటలు తమకు ఎంతో ప్రేరణగా నిలిచాయని వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టీమ్ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ (Shami) అప్పటి సంగతులను మరోసారి గుర్తు చేసుకున్నాడు. షమీని అప్యాయంగా కౌగిలించుకుని ప్రధాని ధైర్యం చెప్పిన వీడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. మోదీ (PM Modi) రాక తమను ఆశ్చర్యానికి గురి చేసిందని షమీ తాజాగా వ్యాఖ్యానించాడు.
‘‘ఓటమి బాధతో డ్రెస్సింగ్ రూమ్లో అలానే కూర్చుండిపోయాం. దాదాపు రెండు నెలలపాటు పడిన శ్రమ ఒక్క మ్యాచ్ ఫలితంతో నిరుపయోగంగా మారింది. ఆ రోజు మాకు కలిసిరాలేదు. ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్లోకి రావడంతో మేమంతా ఆశ్చర్యపోయాం. ఒక్కసారిగా తలెత్తి ఆయనను చూశాం. అసలు మోదీ అక్కడికి వస్తారన్న సమాచారం కూడా మాకు లేదు. అసలు ఆ సమయంలో మేం ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేము. అలాగే తిండి కూడా తినాలనిపించలేదు. కానీ, ప్రధాని మోదీని డ్రెస్సింగ్ రూమ్లో చూసి ఆశ్చర్యంతోపాటు ఆనందం కలిగింది. ఆయన మా దగ్గరకు వచ్చి ఒక్కొక్కరితో మాట్లాడారు. బాగా ఆడారని ధైర్యం చెప్పారు. ఆ తర్వాత నుంచే ఆటగాళ్లు ఒకరితో మరొకరం మాట్లాడుకున్నాం. మనం ఈ ఓటమి బాధను తట్టుకుని ముందుకు సాగాలని భావించాం. ప్రధాని మోదీ పరామర్శ మాకు ఉపయోగపడింది’’ అని షమీ తెలిపాడు.
ఇండియన్ అని గర్వంగా చెబుతా
వరల్డ్ కప్లో ఐదు వికెట్లు సాధించిన ప్రతిసారీ మైదానంలో మోకాళ్లపై కూర్చుని షమీ సంబరాలు చేసుకున్నాడు. దానిని కూడా పాక్కు చెందిన కొంతమంది అభిమానులు వక్రీకరిస్తూ ట్వీట్లు చేశారు. షమీ ప్రార్థన చేయాలని అనుకున్నాడని.. కాకపోతే భారత్లో అలా చేసేందుకు భయపడ్డాడని పోస్టులు పెట్టారు. దీనినే తాజా ఇంటర్వ్యూలో షమీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అతడు సూటిగా స్పందించాడు.
‘‘ఎవరైనా ప్రార్థన చేయాలనుకుంటే ఎవరు ఆపుతారు? నేను ఎవరినీ ఆపను. అలాగే నన్ను కూడా ఎవరూ ఆపరు. నేను చేయాలనుకుంటే ప్రార్థన చేస్తా. ఇందులో సమస్య ఎక్కడుంది? నేను ఇప్పటికీ సగర్వంగా చెబుతా. నేను భారతీయుడిని. నేను ముస్లిం అని. నాకు ఇలాంటి సమస్యే ఎదురైతే..? భారత్లో ఇన్నేళ్లు ఉండలేను కదా. నేను ఎవరి అనుమతినైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఉండటం ఎందుకు? సోషల్ మీడియాల్లో చాలా కామెంట్లు చూశా. గతంలోనూ నేను ఐదు వికెట్లు సాధించిన సందర్భాలున్నాయి. కానీ, ఎక్కడైనా ప్రార్థన చేశానా? కొందరు కావాలనే వివాదాలు సృష్టించడానికే ఇలాంటి కామెంట్లు చేస్తారు. వీళ్లెవరూ మీతో కానీ, నాతో కానీ ఉండరు. ఎవరినీ ప్రేమించరు. వారికి కావాల్సింది ఇలాంటి కంటెంట్ మాత్రమే. బౌలింగ్లో నా శ్రమకు ఫలితం వచ్చినప్పుడు అలా మోకాళ్లపై కూర్చుంటా. బౌలింగ్ కోసం చాలా కష్టపడటం వల్ల అలసిపోతా. అంతేకానీ, కొందరు అనుకున్నట్లుగా అక్కడేమీ ఉండదు’’ అని షమీ స్పష్టం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు