WI vs IND: చాహల్ ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: శార్దూల్
మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ను విండీస్తో వన్డే సిరీస్లో (WI vs IND) ఒక్క మ్యాచ్లోనూ ఆడించలేదు. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్తో మూడు వన్డేల (WI vs IND) సిరీస్ను టీమ్ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుని యువకులకు అవకాశం ఇచ్చారు. అయితే యుజ్వేంద్ర చాహల్కు ఒక్క అవకాశం కూడా రాలేదు. అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ను స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఆడించింది. మొత్తం 16 మందిలో 15 మందికి ఆడే అవకాశం దక్కింది. కొత్తగా వచ్చిన ముకేశ్ కుమార్తోపాటు సీనియర్ పేసర్ జయ్దేవ్నూ బరిలోకి దింపింది. కానీ, చాహల్ను మాత్రం పక్కన పెట్టేయడంతో అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో భారత ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్పందించాడు. మణికట్టు మాంత్రికుడు చాహల్ ప్రత్యేకంగా నిరూపించుకోవడానికి ఏం లేదని, ఇలాంటి వాటి గురించి ఆలోచించడని శార్దూల్ వ్యాఖ్యానించాడు.
భారత క్రికెట్ అభిమానులకు నా విజ్ఞప్తి అదొక్కటే: అశ్విన్
‘‘చాహల్ అద్భుతమైన ప్లేయర్. కొన్నేళ్లుగా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నాడు. కాబట్టి కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అయితే, అతడు ఆడాలా..? వద్దా...? అనేది మేనేజ్మెంట్ ఇష్టం. ఎప్పుడు అవకాశం వచ్చినా నాణ్యమైన ప్రదర్శన ఇవ్వడానికి చాహల్ సిద్ధంగా ఉంటాడు. ప్రతి మ్యాచ్లోనూ వికెట్లు తీయగల సత్తాగల బౌలర్. కాబట్టి, ఏదో ఒక సిరీస్ ఆడనంత మాత్రాన నిరుత్సాహానికి గురవుతాడని నేను అనుకోవడం లేదు’’ అని శార్దూల్ తెలిపాడు.
శార్దూల్ నిలకడైన బౌలర్: చోప్రా
‘‘వెస్టిండీస్తో వన్డే సిరీస్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ను అభినందించకుండా ఉండలేం. భారత్ తరఫున 2019 ప్రపంచకప్ నుంచి ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు (50) తీసిన బౌలర్ కూడా శార్దూల్ కావడం విశేషం. బుమ్రా, షమీ, సిరాజ్ తర్వాత నాలుగో ఫాస్ట్ బౌలర్ ఎవరనేది ఇక్కడ ప్రశ్న. తప్పకుండా శార్దూల్ ఠాకూర్ అవుతాడు. ఉమ్రాన్ మాలిక్ గొప్పగా రాణించలేకపోతున్నాడు. అందుకే శార్దూల్ తర్వాతనే ఉమ్రాన్ ఉంటాడు. వన్డే ప్రపంచ కప్లో శార్దూల్ ఆడటం వల్ల రెండు విధాలుగా భారత్కు లాభిస్తుంది. బ్యాటింగ్ కూడా చేయగల సత్తా ఉన్న శార్దూల్కు చోటు ఇవ్వడం అవసరం’’ అని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!