ODI World Cup 2023: భారత క్రికెట్ అభిమానులకు నా విజ్ఞప్తి అదొక్కటే: అశ్విన్
స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ (ODi World Cup 2023) జరగనుడటంతో భారత్పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎలాగైనా ఛాంపియన్గా నిలిచి పదేళ్ల నిరీక్షణకు తెరదించేలా ఆడాలని అభిమానులు కోరుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు పదేళ్ల నుంచి కళ్లు కాయలు కాచేలా ఐసీసీ ట్రోఫీ కోసం టీమ్ఇండియా (Team India) ఎదురు చూస్తోంది. ఇప్పుడు స్వదేశంలోనే వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) మెగా టోర్నీ జరగనుంది. ఈసారైనా ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించాలని అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) అభిమానులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాడు. సానుకూల దృక్పథంతో క్రికెట్ జట్టుకు మద్దతుగా నిలవాలని కోరాడు.
‘‘గెలిచి వస్తే అభినందనలు చెబుదాం. ఒకవేళ కప్తో రాకపోయినా మద్దతుగా నిలుద్దాం. సానుకూల దృక్పథంతో జట్టుకు అండగా నిలవాలని అభిమానులను కోరుతున్నా. వన్డే ప్రపంచకప్ను గెలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఏదో ఒక ఆటగాడిని తీసుకుంటేనో.. లేకపోతే మరో ఆటగాడిని పక్కన పెడితేనో విజయం సాధించం. అందరూ సమష్టిగా ఆడితేనే గెలుస్తాం. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే అక్కడితో ఆగిపోం. ముందుకు సాగిపోవాలి. అంతేకానీ, అతడిని జట్టులోకి తీసుకొంటే గెలిచి ఉండేవాళ్లమనే వ్యాఖ్యలు సరికావు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇలా చేస్తే బాగుండేది.. అలా జరిగితే జట్టుకు ప్రయోజనం అనే మాటలు ఇక్కడ పనికిరావు. వచ్చే ప్రపంచకప్లోనూ భారత్ విజయం సాధించాలని మాత్రమే కోరుకుందాం. ఎందుకంటే గత మెగా టోర్నీల్లో సెమీస్ వరకు చేరిన రికార్డు భారత్ సొంతం’’ అని అశ్విన్ తెలిపాడు.
బుమ్రా ఆడకపోతే.. గతేడాది ఫలితమే పునరావృతం: కైఫ్
భారత్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన తర్వాత జరిగిన మెగా టోర్నీల్లో విజేతగా నిలవలేదు. అయితే, ఎక్కువ టోర్నీల్లో సెమీస్ వరకు చేరింది. 2014 టీ20 ప్రపంచకప్లో ఫైనల్కూ చేరినా ఛాంపియన్గా నిలవలేకపోయింది. ఇక 2015, 2019 వన్డే ప్రపంచకప్ల్లో సెమీస్, ఆ తర్వాత 2016, 2022 టీ20 ప్రపంచకప్ల్లోనూ సెమీస్కు చేరింది. అలాగే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
పొట్టి ఫార్మాట్ వచ్చాక బౌలర్లపై బ్యాటర్లదే ఆధిపత్యం. మరీ ముఖ్యంగా ఐపీఎల్ వంటి లీగుల్లో ఇది ఎక్కువైంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. -
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
నాలుగు మ్యాచ్లు ఉన్నా సరే.. ఒకే ఒక్క పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే చివరి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసే అవకాశం ఉంది. -
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఏపీఎల్లోనూ భారీ ధరను దక్కించుకోవడం విశేషం. -
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ
-
షర్మిల పిటిషన్.. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే