IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
భారత్తో కరోనా కారణంగా వాయిదాపడిన ఐదో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం వైపు దూసుకెళ్తోంది. 378 పరుగుల లక్ష్య ఛేదనలో ...
గెలిస్తే ఇంగ్లాండ్కిదే ఫస్ట్టైమ్
ఇంటర్నెట్ డెస్క్: భారత్తో కరోనా కారణంగా వాయిదాపడిన ఐదో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం వైపు దూసుకెళ్తోంది. 378 పరుగుల లక్ష్య ఛేదనలో ఇప్పటికే 259/3 స్కోరు చేసిన ఇంగ్లాండ్ ఆఖరి రోజు మరో 119 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఒక వేళ ఇంగ్లాండ్ విజయం సాధిస్తే ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమమవుతుంది. మన బౌలర్లు విజృంభించి వికెట్లు పడగొడితే భారత్ 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల ఛేదన చేసిన టాప్-4 మ్యాచ్లేవి..? ఇంగ్లాండ్ ఛేదించిన భారీ లక్ష్యమెంత..?
విండీస్దే రికార్డు
(ఫొటో సోర్స్: విండీస్ క్రికెట్ ట్విటర్)
ఐదు రోజులపాటు సాగే టెస్టు మ్యాచ్ ఎన్నో మలుపులు తిరుగుతుంది. మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోవడానికి ఒకటీ రెండు సెషన్లు చాలు.. అందుకే ప్రతి వికెట్టూ విలువైందే. ఇప్పటి వరకు ప్రపంచ టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన వెస్టిండీస్ పేరిట ఉంది. 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో విండీస్ 418 పరుగులను ఛేదించేసింది. ఆ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మొదటి ఇన్నింగ్స్లో 240 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ కూడా తన తొలి ఇన్నింగ్స్లో 240 పరుగులే చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లు జస్టిన్ లాంగర్ (111), మ్యాథ్యూ హేడెన్ (177) శతకాలు చేయడంతో ఆసీస్ 417 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విండీస్ 75 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. అయితే రామ్నరేశ్ శర్వాన్ (105), శివనారాయణ్ చంద్రపాల్ (104) సెంచరీలతోపాటు బ్రియాన్ లారా (60) అర్ధశతకం సాధించడంతో ఏడు వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి విజయం సాధించింది.
మళ్లీ ఆసీస్కే ఝలక్..
(ఫొటో సోర్స్: దక్షిణాఫ్రికా క్రికెట్ ట్విటర్)
మరోసారి ఆస్ట్రేలియాకే ఝలక్ తగిలింది. ఈసారి దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమీ స్మిత్, ‘మిస్టర్ 360’ ఏబీ డివిలియర్స్ కీలక ఇన్నింగ్స్లు ఆడారు. 2008లో పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 375 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికాను 281 పరుగులకే కుప్పకూల్చి 94 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ ఆస్ట్రేలియా 319 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో 414 రన్స్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను గ్రేమీ స్మిత్ (108), ఏబీ డివిలియర్స్ (106*), జేపీ డుమినీ (50*), కల్లిస్ (57) గెలిపించారు. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి దక్షిణాఫ్రికా సంచలనం సృష్టించింది.
తొలుత కంగారూలదే రికార్డు..
(ఫొటో సోర్స్: ఆసీస్ క్రికెట్ ట్విటర్)
దాదాపు 55 ఏళ్లపాటు ఆస్ట్రేలియాదే ఈ ఘనత. క్రికెట్ దిగ్గజం బ్రాడ్మన్ హవా కొనసాగుతున్న వేళ 1948లో ఇంగ్లాండ్పై ఆసీస్ 404 పరుగులను ఛేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అన్నీ భారీ ఇన్నింగ్స్లే కావడం విశేషం. తొలుత సిరిల్ వాష్బ్రూక్ (143), బిల్ ఎడ్రిచ్ (111), సర్ లియోనార్డ్ హట్టన్ (81), సర్ అలెక్ బెడ్సర్ (79) రాణించడంతో ఇంగ్లాండ్ 496 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ కూడానూ ధీటుగానే బదులిచ్చింది. నీల్ హార్వే (112) శతకం.. సామ్ లక్స్టన్ (93), రే లిండ్వాల్ (73) కీల్ మిల్లర్ (58) అర్ధశతకాలు చేయడంతో 458 పరుగులకు ఆలౌటైంది. సర్ డాన్ బ్రాడ్మన్ (33) తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇక 38 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 365/8 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. 404 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ను ఆర్థూర్ మోరిస్ (182), సర్ డాన్ బ్రాడ్మన్ (173*) అద్భుత ఇన్నింగ్స్లతో విజయతీరాలకు చేర్చారు. కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి భారీ ఛేదనను పూర్తి చేయడం విశేషం.
భారత్ కూడా ధాటిగానే..
1976లో విండీస్పైనే భారత్ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. హోల్డింగ్స్, బెర్నాడ్, క్లైవ్ లాయిడ్ వంటి బౌలర్లను ఎదుర్కొని మరీ గెలవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో విండీస్ 359 పరుగులు చేయగా.. భారత్ 228 పరుగులకే ఆలౌటైంది. దీంతో 131 పరుగుల ఆధిక్యం సాధించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 271/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 406 పరుగులు చేసి విజయం సాధించింది. సునీల్ గావస్కర్ (102), గుండప్ప విశ్వనాథ్ (112) శతకాలు సాధించడంతో టీమ్ఇండియా సులువుగా గెలుపొందింది.
ఇంగ్లాండ్కు ఇదే భారీ ఛేదన..
(ఫొటో సోర్స్: ఐసీసీ ట్విటర్)
ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 378 పరుగులను ఛేదిస్తే మాత్రం ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి భారీ లక్ష్య ఛేదన అవుతుంది. ఓవరాల్గా ఎనిమిదో ఛేదనగా మారే అవకాశం ఉంది. ఇంతకుముందు ఇంగ్లాండ్ ఆసీస్పై 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. యాషెస్ సిరీస్లో భాగంగా 2019లో లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 179 పరుగులకే ఆలౌటైంది. అయితే ఆసీస్ బౌలర్లు విజృంభించడంతో మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 67 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌటై ఇంగ్లాండ్ ఎదుట 359 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ ఆట చూశాక ఇంగ్లాండ్ ఓటమి ఖాయమని ప్రతి ఒక్కరూ భావించారు. అందుకు తగ్గట్టుగానే 15 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్కు చేరారు. కానీ జో రూట్ (77), జో డెన్లే (50) కుదురుకుని 126 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్కు చేరడంతో మళ్లీ ఇంగ్లాండ్ శిబిరంలో ఆందోళన రేగింది. ఒక పక్క బెన్ స్టోక్స్ (135*) క్రీజ్లో పాతుకుపోయినప్పటికీ.. ఒక్కొక్క బ్యాటర్ ఔట్ కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అయితే చివరికి జాక్ లీచ్ (1*: 17 బంతుల్లో) సాయంతో బెన్స్టోక్స్ అద్భుత శతకం సాధించి ఇంగ్లాండ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇప్పుడు భారత్తో జరుగుతున్న టెస్టులో బెన్స్టోక్స్ ఇంకా బ్యాటింగ్కు రాలేదు. ఇప్పటికే క్రీజ్లో రూట్ (76*), బెయిర్స్టో (72*) ఉన్నారు. ఈ క్రమంలో వీరిని దాటుకొని విజయం సాధించడం భారత్కు అంత సులువేం కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అత్యుత్తమ వార్షిక జట్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. భారత్ ఎప్పటిలానే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
ముంబయితో మ్యాచ్కు ముందు ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అందరికంటే ఓ బ్యాటర్కు చాలా భయపడేవాడినని పేర్కొన్నాడు. -
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
వరల్డ్ కప్ కోసం స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడికే వైస్ కెప్టెన్సీని అప్పగించింది. -
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు