Surya kumar yadav: సూర్య.. ది ఫినిషర్.. ప్రపంచకప్ ముందు మిస్టర్ 360 మెరుపులు
మొన్నటివరకు వన్డేల్లో భారీ స్కోర్లు చేయలేక తడబడిన సూర్యకుమార్ యాదవ్ (Surya kumar yadav) వన్డే ప్రపంచకప్ ముంగిట తనదైన శైలిలో చెలరేగుతున్నాడు. ఆసీస్తో జరుగుతున్న వన్డే సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో అర్ధ శతకాలు బాది సత్తాచాటాడు.
టీ20ల్లో మొనగాడు.. కానీ వన్డేలకొచ్చేసరికి నామమాత్ర ఆటగాడు! పొట్టి ఫార్మాట్లో 360 డిగ్రీల ఆటతీరుతో పరుగుల సునామీ సృష్టిస్తాడు.. కానీ 50 ఓవర్ల క్రికెట్లో మాత్రం క్రీజులో నిలబడలేక వికెట్ పారేసుకుంటాడు! అలాంటి ఆటగాడు ప్రపంచకప్ జట్టు (World Cup 2023)లో ఎందుకు? అతనికి బదులు ప్రతిభావంతులైన ఇతరులకు ఛాన్స్ ఇవ్వొచ్చు కదా? అనే ప్రశ్నలు. కానీ ఆ ఆటగాడు ఒక్కసారిగా జూలు విదిల్చాడు. వన్డేల్లోనూ పరుగులు చేయగల సామర్థ్యం ఉందని తన ఆటపై నెలకొన్న సందేహాలకు బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. ప్రపంచకప్ ముందు వన్డేల్లోనూ జోరందుకుని జట్టు నమ్మకాన్ని నిలబెట్టేలా కనిపిస్తున్నాడు. ఆ ఆటగాడే సూర్యకుమార్ యాదవ్ (Surya kumar yadav) అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియాతో సిరీస్లో తొలి రెండు వన్డేల్లోనూ అర్ధశతకాలు సాధించి సత్తాచాటాడీ ముంబాయి బ్యాటర్.
ఫినిషర్గా..
‘‘సూర్యను ఫినిషర్గా ఆడించాలి. పరిస్థితులను బట్టి అయిదు నుంచి ఏడు స్థానాల్లో అతణ్ని పంపించాలి. చివరి 15 నుంచి 20 ఓవర్లు ఆడించాలి’’ అని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అన్నాడు. ఈ మాటల్లో అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఫినిషర్ పాత్రకు సూర్య సరిగ్గా సరిపోతాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో అతను అర్ధశతకాలను సాధించిన విధానమే అందుకు రుజువు. తొలి రెండు వన్డేల్లో విభిన్నమైన ఇన్నింగ్స్లాడాడతను. తొలి వన్డేలో 277 పరుగుల లక్ష్య ఛేదనలో 185/4తో నిలిచిన జట్టును కేఎల్ రాహుల్ (KL Rahul)తో కలిసి విజయం దిశగా సూర్య నడిపించాడు. పరిస్థితులకు తగ్గట్లుగా 49 బంతుల్లో 50 పరుగులతో సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టుకు విజయం ఖాయం చేసి నిష్క్రమించాడు. ఇక రెండో మ్యాచ్లో తనలోని మరో కోణం చూపించాడు. కేవలం 37 బంతుల్లోనే అజేయంగా 72 పరుగులు చేసి జట్టుకు ఊహించని భారీ స్కోరు అందించాడు. ఓ ఫినిషర్ ఇంతకంటే ఇంకేం చేయగలడు? అందుకే ఈ పాత్రను సూర్య సమర్థంగా పోషిస్తాడని చెబుతున్నారు. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు జట్టుకు భారీ స్కోరు అందించేలా, ఛేదనలో ఒత్తిడిలోనూ నిలబడి జట్టును గెలిపించేలా సూర్య ఆడగలడు.
ఏం మారింది?
ఒకప్పుడు వరుసగా డకౌట్లయిన స్థితి నుంచి ఇప్పుడు నిలకడగా రాణించే స్థాయికి సూర్య ఎదిగాడు. వన్డేలకు తగ్గట్లుగా తన ఆటతీరును మార్చుకున్నాడు. టీ20 స్పెషలిస్ట్ నుంచి ఇప్పుడు వన్డే బ్యాటర్గానూ మారాడు. వన్డేల్లోనూ తొలి బంతి నుంచే బాదాలనే ఆలోచనతో సూర్య ఉండేవాడు. అందుకే వికెట్ పారేసుకునేవాడు. కానీ ఇప్పుడు కుదురుకుంటే వన్డేల్లో ఆడేందుకు చాలా బంతులుంటాయని అర్థం చేసుకున్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా గేరు మారుస్తున్నాడు. వన్డేల్లో చాలా ఓవర్లుంటాయి. పిచ్, ప్రత్యర్థి బౌలింగ్పై ముందుగా ఓ అంచనాకు రావాలి. సూర్య ఇప్పుడదే చేస్తున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ క్రీజులో పట్టుదలగా నిలబడి, వికెట్ ఇవ్వకూడదనే లక్ష్యంతో ఆడుతున్నాడు. కాస్త కుదురుకున్నాక తనదైన శైలిలో ఊచకోత కోస్తున్నాడు. పిచ్తో సంబంధం లేకుండా.. ఏ బంతి వేసినా బౌండరీ కొట్టే సామర్థ్యం సూర్య సొంతం. రెండో వన్డేలో కామెరూన్ గ్రీన్ ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదడమే అందుకు నిదర్శనం. ఒక్కో సిక్సర్ ఒక్కో రకంగా.. బ్యాక్వర్డ్ స్క్వేర్లెగ్, ఫైన్ లెగ్, ఎక్స్ట్రా కవర్, ఫార్వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు పంపించాడు. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా సూర్యకుమార్కు అవకాశాలిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ప్రపంచకప్ తుదిజట్టులో ఎవరిని ఆడించాలన్నది భారత్కు తీయనైన తలనొప్పిగా మారింది. కానీ ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చే సూర్యలాంటి ఆటగాడు ఇలాంటి ఫామ్లో ఉండగా పక్కనపెట్టడం అంటే కష్టమే.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అత్యుత్తమ వార్షిక జట్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. భారత్ ఎప్పటిలానే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
ముంబయితో మ్యాచ్కు ముందు ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అందరికంటే ఓ బ్యాటర్కు చాలా భయపడేవాడినని పేర్కొన్నాడు. -
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
వరల్డ్ కప్ కోసం స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడికే వైస్ కెప్టెన్సీని అప్పగించింది. -
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య