Virat Kohli: మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో అత్యధిక పరుగులు చేసే వారికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అతడు. దాదాపు ప్రతి మ్యాచ్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడిన బ్యాటర్. అయినా, అతడి ఆటతీరుపై విమర్శలు రేగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. ఆ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీనేనని. ప్రస్తుత ఎడిషన్లో తక్కువ స్ట్రైక్రేట్తో పరుగులు చేస్తున్నాడనే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. తనపై వచ్చిన కామెంట్లపై గుజరాత్తో మ్యాచ్ అనంతరం కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. ఈ మ్యాచ్లో అతడు 70 పరుగులతో అజేయంగా నిలిచాడు.
‘‘నేను స్పిన్ను సరిగ్గా ఆడలేనని.. స్ట్రైక్రేట్ తక్కువగా ఉందని కామెంట్లు చేసేవారికి ఆటపై పెద్దగా అవగాహన ఉండి ఉండదు. ప్రతి మ్యాచ్లో విజయం కోసమే మేం ఆడతాం. అలా ఉండబట్టే 15 ఏళ్లుగా కొనసాగుతున్నా. ప్రతి రోజూ జట్టు కోసం ఆలోచిస్తాం. బయట కూర్చొని కామెంట్లు చేసే చాలా మందికి మ్యాచ్ పరిస్థితి తెలియదు. అభిమానులు మాత్రం మా నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శన ఆశిస్తారు. అందులో తప్పేం లేదు. కానీ, మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉందనేది కూడా మాకు చాలా కీలకం. ఉన్నతస్థాయిలో క్రికెట్ ఆడిన వారెవరూ అలాంటి వ్యాఖ్యలు చేయరు. తెలిసీతెలియని వారే విమర్శలు చేస్తుంటారు. ఆత్మగౌరవంతో మ్యాచ్లను ఆడతాం. అంతేకానీ, బయట నుంచి వచ్చే కామెంట్లను నేను పెద్దగా పట్టించుకోను. అటువైపు దృష్టిసారిస్తే ఏకాగ్రతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
గుజరాత్తో మ్యాచ్ను చాలా ముందుగా పూర్తి చేయడం ఆనందంగా ఉంది. విల్ జాక్స్ బ్యాటింగ్కు వచ్చిన ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. సరిగ్గా బ్యాట్ను తాకడం లేదని ఆందోళన చెందాడు. దీంతో నేను స్ట్రైకింగ్ను తీసుకొనేందుకు ముందుకు వచ్చా. మిడిల్ ఓవర్లలో మరింత దూకుడుగా ఆడాలని మాత్రమే అనుకున్నాం. మోహిత్ ఓవర్లో భారీ షాట్లు కొట్టిన తర్వాత జాక్స్ మరింత ప్రమాదకరంగా మారాడు. దీంతో నా పాత్ర పూర్తిగా మారిపోయింది. మేం 19వ ఓవర్లోపే గెలుస్తామని భావించాం. కానీ, 16 ఓవర్లలోనే 200 టార్గెట్ను ఛేజ్ చేయడం అద్భుతం. టీ20ల్లో నేను చూసిన అత్యుత్తమ శతకాల్లో విల్జాక్స్ సెంచరీ కూడా ఉంటుంది. పిచ్ చాలా బాగుంది. మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావించాం. టాస్ నెగ్గిన జట్టు తప్పకుండా తొలుత బౌలింగ్కు మొగ్గు చూపుతుందని తెలుసు. భారీ విజయం సాధించడంలో మా బౌలర్లదీ కీలక పాత్రే. సరైన సమయంలో వికెట్లు తీసి గుజరాత్ను కట్టడి చేయగలిగాం’’ అని కోహ్లీ తెలిపాడు. విల్జాక్స్తో కలిసి రెండో వికెట్కు 166 పరుగులను జోడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ మళ్లీ నెట్టింట ట్రెండింగ్లోకి వచ్చాడు. గౌతమ్ గంభీర్ చేసిన పోస్టూ వైరల్గా మారింది. -
ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్కు వర్షం ముప్పు
మే 18న చెన్నై, ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. -
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
సెలవుల్లో అమెరికా వెళ్లేందుకు తానెంతో ఇష్టపడతానంటూ టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. అందుకు గల కారణాలను వివరించాడు. -
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. రెండు బెర్తుల కోసం ఐదు టీమ్లు.. ఏ జట్టు పర్సంటేజీ ఎంతంటే?
మెగా లీగ్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఐదు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. -
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంటున్న వేళ.. మరో ఆసక్తికర మ్యాచ్ అభిమానులను అలరించేందుకు వస్తోంది. -
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
మ్యాచులన్నీ ముగిసినా.. ఇటు బయటకు వెళ్లలేని పరిస్థితి. అటు నాకౌట్ దశకు అర్హత దక్కుతుందో తెలియని సంకటస్థితి దిల్లీ జట్టుకు ఉంది. -
హెడ్ కోచ్గా కొనసాగమని కోరినా.. తిరస్కరించిన ద్రవిడ్
ద్రవిడ్ ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో కోచ్ పదవి నుంచి వైదలగాలని భావిస్తున్నాడు. కనీసం టెస్టు జట్టుకు కూడా అతడు కోచ్గా ఉండేందుకు నిరాకరించినట్లు సమాచారం. -
నా జీవితంలో ‘గోయెంకా - కేఎల్ రాహుల్’ ఎపిసోడ్ ఐదో సర్ప్రైజ్: లాంగర్
సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ - సంజీవ్ గోయెంకా సంభాషణ వైరల్గా మారిపోయింది. ఆ పరిణామాలపై లఖ్నవూ కోచ్ స్పందించాడు. -
పవర్ప్లేలో వికెట్లు కోల్పోవడం పెద్ద దెబ్బే: కేఎల్ రాహుల్
లఖ్నవూకు ఈ సీజన్లో ఏడో ఓటమి ఎదురైంది. ప్లేఆఫ్స్కు వెళ్దామనే ఆశలకు బ్రేక్ పడేలా ఉంది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
హార్దిక్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్.. వారిద్దరు ఐపీఎల్లో ఏం సాధించారు?: గంభీర్
హార్దిక్ నాయకత్వంపై విమర్శలు చేసిన విదేశీ మాజీ క్రికెటర్లను గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. ఐపీఎల్లో ఆ ఇద్దరి పాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. -
దిల్లీ విజయంతో..
దిల్లీ గెలుపుతో లీగ్ దశను ముగించింది. బ్యాటుతో పోరెల్, స్టబ్స్.. బంతితో ఇషాంత్ మెరిసిన వేళ లఖ్నవూను మట్టికరిపించింది. ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న దిల్లీ, సాంకేతికంగా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. -
ద్రవిడ్ స్థానంలో ఎవరు?
టీ20 ప్రపంచకప్తో రాహుల్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో బీసీసీఐ కొత్త ప్రధాన కోచ్ వేటను మొదలెట్టింది. ఇప్పటికే ఆ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఆసక్తికర అంశం. -
అగ్రస్థానంలో మను
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను బాకర్ అగ్రస్థానం సాధించింది. మంగళవారం ఆఖరిదైన నాలుగో ట్రయల్స్లో ఆమె విజేతగా నిలిచింది. -
ఆ నిబంధన మంచిదే
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను చాలా మంది ఆటగాళ్లు, నిపుణులు విమర్శిస్తుంటే, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం అది మంచిదే అంటున్నాడు. ఆ నిబంధన వల్ల మ్యాచ్లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు. -
ఆ ట్రోఫీని వేలం వేయొద్దు
1986 ఫుట్బాల్ ప్రపంచకప్లో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా సాధించిన ‘గోల్డెన్బాల్ ట్రోఫీ’ని వేలం వేయొద్దని అతడి వారసులు కోర్టుకెక్కనున్నారు. -
టాప్సీడ్గా అర్జున్
యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశికి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ లభించింది. ఇటీవల వార్సాలో ముగిసిన సూపర్బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీని అయిదో స్థానంలో ముగించిన అర్జున్.. -
మనిక @ 24
భారత టేబుల్టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఆమె 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ఫైనల్లో ‘లక్ష్య’ శ్రీనివాస్
ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ మెరిశాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో అతడు ఫైనల్కు దూసుకెళ్లాడు. -
సెమీస్లో గౌరవ్
ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో గౌరవ్ చౌహాన్ పతకం ఖాయం చేశాడు. 92 కేజీల పైన విభాగంలో అతడు సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. మంగళవారం క్వార్టర్స్లో గౌరవ్ 3-2తో డానియల్ స్పార్బే (కజకిస్థాన్)ను ఓడించాడు.
తాజా వార్తలు (Latest News)
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
-
తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి
-
మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు గుడ్న్యూస్.. కేవైసీ నిబంధనల్లో సడలింపు
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!
-
ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్కు వర్షం ముప్పు