ఈడీ లేఖపై ఏం చర్యలు తీసుకున్నారు!

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 03:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

భూదాన్‌ భూముల వ్యవహారంలో మహేశ్వరం పోలీసుల వివరణ కోరిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్‌భూముల వ్యవహారంలో అవకతవకలు, రికార్డుల తారుమారు జరిగినట్లుందని, దీనిపై పరిశీలించాలంటూ ఈడీ రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ మహేశ్వరం పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. భూదాన్‌ భూముల్లో రికార్డులు మార్చారని, మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని ఈడీ లేఖ రాసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్‌చేస్తూ సర్వేనం.181లో భూమి ఉన్న దస్తగిరి షరీఫ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..2024లో మహేశ్వరం డీసీపీకి ఈడీ లేఖ రాసిందన్నారు. తప్పుడు పత్రాలను సృష్టించారని, ఫోర్జరీలు చేశారని, రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని విచారణలో తేలిందని, దీనిపై విచారించాలంటూ ఈడీ లేఖ రాసిందన్నారు. విచారణ జరిపి ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసుల వివరణ కోరుతూ విచారణను వారానికి వాయిదా వేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని