పీర్‌ షబ్బీర్‌ సేవలు మరువలేనివి: సీఎం రేవంత్‌రెడ్డి

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 03:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మాజీ ఎమ్మెల్సీ కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు

పహాడీషరీఫ్, న్యూస్‌టుడే: ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్సీ మౌలానా హఫీజ్‌ పీర్‌ షబ్బీర్‌ కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి పురపాలిక షాహిన్‌నగర్‌ మర్కజ్‌ సమీపంలోని ఆయన నివాసానికి సోమవారం రాత్రి వెళ్లిన ముఖ్యమంత్రి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీర్‌ షబ్బీర్‌ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన మృతి తీరని లోటుని ముస్లిం మతపెద్దల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రిగానే కాకుండా వ్యక్తిగతంగానూ వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో శ్రీశైలం రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ముఖ్యమంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని