రుద్రమదేవి దిగిన బావి.. మళ్లీ కళకళ

Eenadu icon
By Telangana News Desk Updated : 28 Oct 2025 08:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

రాణి రుద్రమదేవి స్నానమాడిన కాకతీయుల కాలం నాటి మెట్లబావికి పూర్వ వైభవం వచ్చింది. వరంగల్‌ ఫోర్టురోడ్డు శివనగర్‌లో నలువైపులా 14 మీటర్ల వెడల్పుతో చతురస్రాకారంలో ఉండే ఈ బావి కాకతీయుల కాలం నాటి శిల్పసంపదకు అద్దం పడుతోంది. నిర్వహణ లేక శిథిలావస్థకు చేరిన బావి పునరుద్ధరణ పనులు చేపట్టారు. అవి పూర్తవడంతో సోమవారం మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. కాకతీయ కోట నుంచి ఈ బావికి  రుద్రమదేవి సొరంగ మార్గాన వచ్చేవారని, ప్రస్తుతం ఆ మార్గం పూడుకుపోయిందని స్థానికులు చెబుతారు. 

న్యూస్‌టుడే, శివనగర్‌(వరంగల్‌)

Tags :
Published : 28 Oct 2025 08:16 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు